జగన్ సభల నుంచి జనం పారిపోకుండా ఆపడమెలా ?

సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల మీట నొక్కే కార్యక్రమాలను బహిరంగసభలుగా నిర్వహిస్తున్నారు. అయితే ఆ సభలకు జనాలను సమీకరించడం.., సభ అయ్యే వరకూ వారిని కదలకుండా కూర్చోబెట్టడం అధికారులకు వైసీపీ నేతలకు పెద్ద సవాల్‌గా మారింది. అది రాజకీయ పార్టీ సభ కాకపోవడంతో వైసీపీ నేతలు పెద్దగా జన సమీకరణ చేయడం లేదు. అధికారులే పథకాల లబ్దిదారులను తీసుకొస్తున్నారు. బలవంతంగానో.. బెదిరించో..బామాలో తీసుకు వస్తున్నారు కానీ ఉంచలేకపోతున్నారు.

సీఎం చెప్పిన సమయానికి వస్తే సమస్యే ఉండదేమో కానీ రెండు, మూడు గంటలు ఆలస్యంగా వస్తున్నారు. ఫలితంగా అసహనానికి గురవుతున్నారు. సీఎం ప్రసంగం స్టార్ట్ చేసే వరకూ ఉండి… హమ్మయ్య ఇకహాజరు వేయించుకున్నా చాలనుకుని లేచి వెళ్లిపోతున్నారు. మొన్న తిరుపతిలో ఇవాళ ఉంగుటూరులోనూ ఇవే సీన్లు రిపీట్ అయ్యాయి. మీడియాలోనూ విస్తృత ప్రచారం జరిగింది. వైసీపీ నేతలు చెప్పుకునే వ్యతిరేక మీడియా ఇలాంటి వాటిని ఎందుకు వదిలి పెడుతుంది.

ఉంగుటూరులో సభ ప్రాంగణం చాలా వరకూ ఖాళీగా ఉంది. వచ్చిన వాళ్లు కూడా మధ్యలోనే వెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితులపై వైసీపీ నేతలు రివ్యూ చేసుకోవాల్సి ఉంది. లేకపోతే… జగన్ ప్రసంగాలను వినేందుకు జగన్ ఆసక్తి గా లేరని.. ప్రజలు ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం కోల్పోయారన్న అభిప్రాయం ఏర్పడుతుంది. ఇప్పటికే గడపగడపకీ ప్రభుత్వం కార్యక్రమంలో ఎక్కువ ఎదురుదెబ్బలు తగులుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నిలదీతల వీడియోలే కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close