కాంగ్రెస్‌కు ఐటమ్ కష్టం తెచ్చిన కమల్‌నాథ్..!

మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ” ఐటం ” దుమారం రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి.. బీజేపీ ఆకర్ష్ దెబ్బకు సీఎం పదవి కోల్పోయిన కమల్‌నాథ్ … అలా ఫిరాయించి.. బీజేపీ ప్రభుత్వంలో మంత్రి పదవి పొంది.. ఇప్పుడు ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ మహిళా నేతను.. ” ఐటం “గా అభివర్ణించారు. ఈ ఒక్క మాట.. బీజేపీకి.. ఇతర పార్టీలకు… పెద్ద ఆయుధంగా మారిపోయింది. చివరికి చివరికి రాహుల్ గాంధీ జోక్యం చేసుకుని కమల్‌నాథ్ తప్పుగా మాట్లాడారని అనాల్సి వచ్చింది. రాహుల్ స్పందనతో బీజేపీకి మరింత బలం వచ్చింది.

కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనను బహిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్‌ క్షమాపణలు చెప్పాలని అంటోంది. కమల్‌నాథ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇటు జాతీయ మహిళా కమిషన్‌ కూడా ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ సాగుతోంది. అయితే కమల్ నాథ్ మాత్రం తన ఐటమ్ వ్యాఖ్యల్నిగట్టిగా సమర్ధించుకున్నారు. ఎవరినీ కించపరచాలనుకోలేదని చెప్పుకొస్తున్నారు. ప్రసంగిస్తున్న సమయంలో అభ్యర్థి పేరు గుర్తు రాకపోవడంతో ఐటమ్ అనే మాట వాడాల్సి వచ్చిందని కమల్‌నాథ్‌ వివరణ ఇచ్చారు. చెప్పుకునేందుకు ఏమీ లేకే బీజేపీ ఈ అంశంపై వివాదం చేస్తోందని ఆరోపించారు.

మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 3వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. డబ్రాలో కమలదళం తరఫున ఇమర్తీ దేవి బరిలో ఉన్నారు. జ్యోతిరాదిత్య సింధియాతోపాటు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన 22 మంది ఎమ్మెల్యేల్లో ఆమె కూడా ఒకరు. వారి ఫిరాయింపు వల్లే రాష్ట్రంలో కమల్‌నాథ్‌ ప్రభుత్వం పడిపోయింది. ఆ కోపంలో కమల్‌నాథ్ అలా వ్యాఖ్యానించారని భావిస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్‌ను ఐటమ్ విమర్శ.. డిఫెన్స్‌లో పడేసినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నా కొడుకును ఉరి తీయండి… మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లోనే సంచ‌ల‌నం సృష్టిస్తున్న బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసుల‌పై ష‌కీల్ స్పందించారు. ఓ కేసులో బెయిల్ రాగానే మ‌రో కేసు తెర‌పైకి తీసుక‌రావ‌టం వెనుక...

నగరి రివ్యూ : రోజాకు ఏడుపొక్కటే మిగిలింది !

ఆంధ్రప్రదేశ్ లోని సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం. టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో రెండు సార్లు రోజా గెలిచారు. మరి ఈ సారి గెలుస్తారా...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ ‘కిష్కింద‌పురి’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ 11వ చిత్రానికి సంబంధించి శ్రీ‌రామ‌న‌వ‌మి రోజున అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ చిత్రానికి సాహు గార‌పాటి నిర్మాత‌. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇదోక హార‌ర్ మిస్ట‌రీ...

విజయశాంతిని ప్రచారానికి కూడా పిలవట్లేదే !

ఏ పార్టీ గాలి ఉంటే ఆ పార్టీలోకి చేరిపోయే విజయశాంతికి అసలు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close