కాల్‌మనీలో బాబే ముద్దాయన్న జగన్: వైసీపీవారే ఎక్కవమందన్న సీఎం

హైదరాబాద్: కాల్‌మనీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ శాసనసభను కుదిపేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ అసెంబ్లీలో ప్రకటన చేస్తూ, ఈ కేసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే ఎక్కువమంది ఉన్నారని చెప్పారు. మొత్తం నిందితులు 220మంది కాగా, వైసీపీవారు 65మంది, టీడీపీకి చెందినవారు 20 మంది, కాంగ్రెస్ వారు 12మంది, సీపీఐవారు ఆరుగురు, సీపీఎమ్ వారు ఒక్కరు, బీజేపీవారు నలుగురు, లోక్‌సత్తాకు చెందిన ఇద్దరు ఉన్నారని ప్రకటించారు. ఏ పార్టీకి చెందనివారు 78మంది ఉన్నారని వెల్లడించారు. దోషులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. కాల్‌మనీ వ్యాపారం ఎప్పటినుంచో జరుగుతుందని అన్నారు. ఎవరిపైన అయినా చండశాసనుడిగా ఉంటానని చెప్పారు.

కాల్‌మనీ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ముద్దాయిగా ఉండి కాల్‌మనీపై స్టేట్‌మెంట్ ఇవ్వటం ఎలా సాధ్యమని అన్నారు. కేసులో నిందితులైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇక్కడే ఉన్నారని, వారిని అరెస్ట్ చేయలేదని, మరి బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తన పాటికి తాను ప్రకటనను చదువుకుంటూ వెళ్ళారని అన్నారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ పాటించకుండా సభను నిర్వహించి సభ్యుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close