చంద్రబాబు అడిగినా ఇవ్వలేదు..! ఇప్పుడు జగన్ అడిగే పరిస్థితి లేదు..!

ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఇవ్వాలంటూ.. చంద్రబాబునాయుడు.. ఐదేళ్లలో నలభై సార్లు ఢిల్లీకి వెళ్లారు. కేంద్రమంత్రుల్ని పదే పదే కలిసేవారు. ఆయన ఒత్తిడిని తట్టుకోలేక… ఎంతో కొంత… నిధులు.. ఏపీకి విడుదల చేసేవారు. అయితే.. వాటికి సంతృప్తి చెందని.. అప్పటి సీఎం.. బీజేపీకి గుడ్ బై చెప్పారు. నిజానికి ఆయన తీసుకున్న నిర్ణయం రాజకీయ పరిమైనదేనని అందరికీ తెలుసు. అందుకే.. ఆ తర్వాత నుంచి కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల కాలేదు. చివరికి… వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను కూడా ఆపేశారు. ఎన్ని సార్లు తీవ్రమైన ఆరోపణలు చేసినప్పటికీ.. వాటిని విడుదల చేయలేదు. ప్రభుత్వం మారి నాలుగు నెలలైనా… కూడా విడుదల చేయలేదు.

అప్పట్లో.. చంద్రబాబు వారానికో సారి సందర్భాన్ని చూసుకుని… కేంద్రం నిధులివ్వడం లేదని…మండిపడేవారు. అయితే అసెంబ్లీ.. లేకపోతే ప్రెస్‌మీట్.. అదీ కాకపోతే.. ఏదో ఓ బహిరంగసభ పెట్టుకుని బీజేపీపై విరుచుకపడేవారు. పదే పదే ప్రశ్నించేవారు. ఇప్పుడు మాత్రం కేంద్రాన్ని అడిగేవారే లేరు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… 22 మంది ఎంపీలున్నప్పటికీ.. ఉన్నా.. లేనట్లేనన్నట్లుగా ఉన్నారు. కేంద్రానికి నిధుల కోసం.. ఇంత వరకూ ఒక్క వినతి పత్రం ఇచ్చినట్లుగా కనిపించలేదు. రాష్ట్రానికి ఫలానా ప్రాజెక్టు కావాలని అడిగిందీ లేదు. బడ్జెట్‌లో రూపాయి కేటాయించకపోయినా… స్పందించలేదు. దీంతో. .. ఏపీ వైపు నుంచి బీజేపీపై ఒత్తిడి తగ్గిపోయింది.

ఇదే విషయాన్ని కమ్యూనిస్టు పార్టీ నేతలు గుర్తు చేసి.. బీజేపీ నేతలపై మండిపడుతున్నారు. గతంలో ఏపీకి నిధులను చంద్రబాబు అడిగినా ఇవ్వలేదని.. ఇప్పుడు జగన్ అడిగే పరిస్థితి లేదన్నారు. ఏపీ కోసం తామున్నామంటూ.. గొప్ప గొప్ప ప్రకటనలు చేసే.. బీజేపీ నేతలు.. జీవీఎల్, కన్నా ఏమయ్యారని… సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నేరుగానే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా జీవీఎల్ నరసింహారావుపై ఆయన మండిపడుతున్నారు. జీవీఎల్‌కు నోరు పడిపోయిందా అని ప్రశ్నించారు. విభజన సమస్యలు.. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన వాటిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కానీ.. బీజేపీ నేతలు.. చంద్రబాబు ఉన్నప్పుడు.. టెన్షన్ తో ఉండేవారు. ప్రజలకు ఏం చెప్పాలా.. అనే కంగారు ఉండేది. ఇప్పుడు ఏమీ చెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రభుత్వమే అడగనప్పుడు వారు మాత్రం ఏం చెబుతారు…?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేశాన్ని బీజేపీ అధోగతి పాలు చేస్తోందా… వాస్తవాలు ఎలా ఉన్నాయంటే..?

విశ్వగురువుగా భారత్ అవతరిస్తోందని బీజేపీ అధినాయకత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి. అభివృద్ధి సంగతి అటుంచితే ఆహార భద్రత విషయంలో బీజేపీ సర్కార్ వైఫల్యం చెందింది. నిరుద్యోగాన్ని...

కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు.. అందుకే టార్గెట్ చేశారా..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నందినగర్ లో కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండటంతో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లుగా...

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ‌ ఈ శిరోముండ‌నం కేసు ఏంటీ?

వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుత మండ‌పేట తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ శిరోముండ‌నం కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌గా... అసలు ఆరోజు ఏం జ‌రిగింది? ఎందుకు ఇంత...

విష్ణు ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీ: భ‌క్త‌క‌న్న‌ప్పపై పుస్త‌కం

రాజ‌మౌళి మెగాఫోన్ ప‌ట్టాక‌, మేకింగ్ స్టైలే కాదు, ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీలు కూడా పూర్తిగా మారిపోయాయి. `బాహుబ‌లి`, `ఆర్‌.ఆర్‌.ఆర్‌` కోసం జ‌క్క‌న్న వేసిన ప‌బ్లిసిటీ ఎత్తులకు బాలీవుడ్ మేధావులు కూడా చిత్త‌యిపోయారు. ఓ హాలీవుడ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close