బ్రేకింగ్ : జగన్ పై దాడి కేసును ఎన్ఐఏకు బదిలీ చేయమన్న హైకోర్టు

విశాఖ ఎయిర్ పోర్ట్లో వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై శ్రీనివాసరావు అనే యువకుడు అక్టోబర్ 25వ తేదీ మధ్యాహ్నం కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి పై విచారణను ఎన్ఐఏ కు అప్పగించాలని హైకోర్టులో వేసిన పిటిషన్ పై ఈరోజు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. చట్ట ప్రకారం ఈ కేసును ఎన్ఐఏ కు బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

అక్టోబరు 25 వ తేదీ ఈ దాడి తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. సాక్షాత్తు డిజిపి విచారణ పూర్తి కాకముందే ప్రెస్ మీట్ పెట్టి దాడి చేసిన యువకుడు వై ఎస్ ఆర్ సి పి అభిమాని అని చెప్పడం, తన దగ్గర ఒక ఉత్తరం దొరికిందని చెప్పడం, ఆ ఉత్తరాన్ని అప్పుడు మీడియాకు విడుదల చేయకుండా చాలా సేపటి తర్వాత విడుదల చేయడం, అంతేకాకుండా తెలుగుదేశం నాయకులు జగన్ స్వయంగా తనపై తానే దాడి చేయించుకున్నాడని వ్యాఖ్యానించడం, బాబు రాజేంద్ర ప్రసాద్ లాంటి తెలుగుదేశం నాయకులు ఒకడుగు ముందుకు వేసి జగన్ తల్లి విజయమ్మ ఈ దాడి చేయించిందని వ్యాఖ్యానించడం లాంటి పరిణామాలు జరిగాయి. దీంతో ఏపీ పోలీసుల ఆధ్వర్యంలో విచారణ జరిగితే తమకు న్యాయం జరగదని భావించిన వైఎస్సార్సీపీ నేతలు, ఎయిర్ పోర్టు లో జరిగిన ఈ దాడి ఘటన విచారణ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కి బదిలీ చేయాలని కోరారు.

ఇప్పుడు ఎన్ఐఏ చట్టం సెక్షన్ 6 ప్రకారం, ఎయిర్ పోర్టు లో జరిగే ఘటనలు రాష్ట్ర పోలీసుల పరిధిలోకి రావు కాబట్టి విచారణ కూడా ఇలాంటి సంస్థ ఆధ్వర్యంలోని జరగాలని కోరిన పిటిషనర్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. అలాగే కేసు దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని పిటిషనర్ చేసిన వాదనతో కూడా హైకోర్టు ఏకీభవించింది.

మొత్తానికి జాతీయ దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో విచారణ ఎటువంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close