జగన్ నిర్ణయాలు… కేసీఆర్‌కు ఇబ్బందికరంగా మారాయా..?

రాష్ట్ర విభజన జరిగిన మొదట్లో.. రెండు రాష్ట్రాల మధ్య ఓ భిన్నమైన వాతారణం ఉండేది. మిగులు రాష్ట్రం తెలంగాణ… ఉద్యోగులకు ఊహించిన దాని కన్నా ఎక్కువగా ఐఆర్, పీఆర్సీ ఇచ్చింది. లోటు రాష్ట్రమైనా.. ఉద్యోగుల్ని..నిరాశపరచకూడదని… చంద్రబాబు కూడా… ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు రివర్స్ అయింది. కేసీఆర్.. ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వకుడా నాన్చుతున్నారు. కానీ జగన్ మాత్రం… 27 శాతం ఐఆర్ ప్రకటించేశారు. అలాగే.. తాను ఆలోచిస్తున్న మరికొన్ని నిర్ణయాలనూ.. జగన్ తీసేసుకున్నారు. దీంతో ఇప్పుడు.. పోలికలు ప్రారంభమయ్యాయి.

ఏపీ ప్రభుత్వం తీసుకొన్న కొన్ని నిర్ణయాలు తెలంగాణా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు, ఆర్టీసీతో పాటు వివిధ చిరు ఉద్యోగుల జీతాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.. జూలై నుండి ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని నిర్ణయించారు. సీపీఎస్ రద్దుపై కమిటీని నియమించారు. దీంతో తెలంగాణలోని ఉద్యోగ వర్గాల్లో ఈ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది..2018 జూలై నుండే కొత్త పీఆర్సీ అమలు కావాల్సింది. వేతనాల పెంపు కోసం కమిటీని నియమించి ఏడాది దాటింది. ఇంకా పీఆర్సీ కమిటీ నివేదిక కూడా ఇవ్వలేదు. కనీసం మధ్యంతర భృతి కూడా ప్రకటించలేదు. ఏపీ ప్రభుత్వం 27 శాతం ఐఆర్ జూలై నుండి ఇస్తామని ప్రకటించింది.సీపీఎస్ రద్దుపై కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ వర్గాల నుండి తెలంగాణా ప్రభుత్వం పై ఒత్తిడి పెరుగుతోంది..

ఆర్టీసీ విషయంలోను సానుకూల నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం కోసం కమిటీ ని నియమించింది. కానీ తెలంగాణా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో కఠినంగా వ్యవహరించింది. సమ్మె చేస్తే అవసరమైతే ప్రైవేటు పరం చేస్తామని స్వయంగా సీఎం కేసీఆరే హెచ్చరించారు. దీంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏపీ తరహాలో తెలంగాణా ప్రభుత్వం కూడా ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయమనే డిమాండ్ పెరిగే అవకాశం ఉందన్న చర్చ తెలంగాణ వర్గాల్లో వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close