ఆ లెక్కన రోహత్గీకి జగన్ రూ. వందల కోట్లు ఇచ్చి ఉంటారా..?

రాజధాని రైతులు వేసిన పిటిషన్లను.. వాదించడానికి ప్రభుత్వం మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని నియమించింది. ఆయనకు రూ. కోటి అడ్వాన్స్ ఇచ్చింది. మరో రూ. నాలుగు కోట్లు విడుదల చేయనుంది. ఆయన ఫీజు నిమిషాల లెక్కన ఉంటుంది. ఎంత సమయం కేసు కోసం కేటాయిస్తే.. అంత ఫీజు వసూలు చేస్తారు. అది ఎంత అనేది..అంచనా వేయడం కష్టం. దేశంలోని అత్యంత ఖరీదైన లాయర్లలో ఆయన మొదటి వారు. ఈ ముకుల్ రోహత్గీని ప్రభుత్వం ప్రత్యేకంగా అపాయింట్ చేసుకోవడానికి ఓ కారణం ఉంది. అదే జగన్మోహన్ రెడ్డితో ఆయనకు ఉన్న అనుబంధం. అయితే.. అది వ్యక్తిగతం కాదు. వృత్తిగతమే. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ఆయన చాలా సార్లు తన వాదనలను.. ఇటు హైకోర్టు.. అటు సుప్రీంకోర్టు ముందు వాదించారు.

జగన్ .. తన అక్రమాస్తుల కేసులో వాదనల కోసం.. ముకుల్ రోహత్గీని కౌన్సుల్‌గా నియమించుకున్నారు. కేసులు నమోదయినప్పుడు.. బెయిల్ పిటిషన్లు వేసినప్పుడు.. ఇతర పిటిషన్లు వేసినప్పుడు.. చాలా సార్లు ఆయన సేవలు వినియోగిచుకున్నారు. ఆయన … చాలా రోజుల పాటు.. జగన్ కేసు ల కోసం సమయం కేటాయించారు. అయితే.. ఆయన లాయర్ ఫీజులు ఎంత చెల్లించారన్నదానిపై చర్చ ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే.. ఢిల్లీ లాయర్లు అత్యంత ఖరీదైన వారని తెలుసు కానీ.. ఎంత ఖరీదు అని తెలియదు. కానీ ఇప్పుడు ప్రభుత్వమే.. ఓ లెక్క విడుదల చేసింది. ఓ కేసు విచారణ కోసమే వాదనలు వినిపించాలంటే.. రూ. ఐదు కోట్లు దగ్గర పెట్టుకోవాలని అంచనా వేసింది. కేసు వాయిదాలు.. విచారణను బట్టి ఈ బిల్లు పెరుగుతూ ఉంటుంది.

ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి తన అక్రమాస్తుల కేసుల్లో వాదనలు వినిపించడానికి కనీసం రూ. వంద కోట్ల రూపాయలు రోహత్గీకి చెల్లించి ఉంటారనే వాదన.. న్యాయవాద వర్గాలు వినిపిస్తున్నాయి. ఒక్క రోహత్గీ బిల్లే.. వందల కోట్లకు చేరి ఉంటుందని.. ఇతర లాయర్లు.. కౌన్సుళ్లు.. ఖర్చుల వ్యవహారం.. ఇంకా ఎక్కువే ఉంటుందని అంటున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి… అక్రమాస్తుల కేసుల్లోని విలువ… తక్కువేం కాదు.. అలాగే.. ఆ కేసుల నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నం కూడా… ఖరీదైనదేనని.. ప్రభుత్వం విడుదల చేసిన జీవోల ద్వారా అర్థం చేసుకోవచ్చంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close