కార్యకర్తలతో జగన్ భేటీలు – బిల్లులు చెల్లించిన తర్వాతే !?

సీఎం జగన్ ఆగస్టు నుంచి నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గం నుంచి యాభై మంది ముఖ్య నేతల్ని పిలిపించి ఈ సమావేశాలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన పార్టీ ఎమ్మెల్యేలకే అపాయింట్‌మెంట్ ఇవ్వరని.. ఇప్పటి వరకూ ఆయనను ప్రత్యక్షంగా ఒక్క సారి కూడా కలవని ఎమ్మెల్యేలు వంద మందికిపైగానే ఉంటారని… ఇప్పుడు నియోజకవర్గాల వారీగా సమీక్షలు పెడితారని ఎలా నమ్మాలని వైసీపీ నేతలు తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు. దానికి కారణాలు ఉన్నాయి.

ప్రతీ రోజూ ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి సమీక్ష పెట్టినా ఆరు నెలల పాటు నిర్విరామంగా నిర్వహించాల్సి ఉంటుంది. అది సాధ్యమా అంటే… ఎవరికైనా కాదనే అనిపిస్తుంది. ఓ వైపు పార్టీ నేతల్ని గడప గడపకూ అని ఒత్తిడి తెస్తూ.. మరో వైపు ఈ సమీక్షలు పెడితే.. ఆ కార్యక్రమంపై సీరియస్‌నెస్ తగ్గిపోతుంది. మధ్యలో అధికారిక పనులు చాలా ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే… నియోజకవర్గాల సమీక్షలు అనేది జగన్‌ ప్రారంభించగలరు కానీ పూర్తి చేయలేరని అనుకోవచ్చు.,

నియోజకవర్గాల సంగతేమోకానీ కనీసం తమకు అయినా అపాయింట్‌మెంట్ ఇవ్వాలని ఎక్కువ మంది వైసీపీ నేతలు కోరుకుంటున్నారు. ఎన్నికలు వస్తున్నాయని.. తమ సమస్యలు వినాలని వారు అనుకుంటున్నారు., అయితే సమస్యలు వింటే పరిష్కారం చూపించాలి.. అది చూపించాలంటే నిధులు కావాలి.. ఎలా అనేది ఇప్పుడు సీఎం ముందున్న ప్రశ్న. అందుకే కలవడం లేదని చెబుతున్నారు.కలుస్తా.. కలుస్తా అని లీకులివ్వడం ఇదే మొదటి సారి కాదు అధికారం చేపట్టి నప్పటి నుండి అంతే ఉంది.

ప్రతి నియోజకవర్గంలో వందలమంది పార్టీ నేతలు ప్రభుత్వంపై నమ్మకంతో పనులుచేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. వారికి బిల్లులు చెల్లించకపోతే వారితో భేటీ అయ్యేందుక జగన్ ఆసక్తి చూపించకపోవచ్చు. చెల్లించడానికి నిధుల సమస్య. ఎలాంటి బిల్లులు పెడింగ్‌లో లేని కార్యకర్తల్ని పిలిస్తే.. ఇతర ముఖ్యనేతలకు కోపం వస్తుంది. తాము ఆర్థికంగా చితికిపోయేలా చేసి ఇతర నేతల్ని ప్రోత్సాహిస్తున్నారని నేతలు అనుమానపడతారు. ఎలా చూసినా జగన్‌కు పార్టీ కార్యక్తలతో భేటీలు మీద సామే అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close