ఆయనలో విశ్వసనీయతే కొరవడింది అందుకే…

ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన పోరాటంలో చిత్తశుద్ధి ఉందో లేదో గానీ దీనితో ఆయన ఒకే దెబ్బకు అరడజను పిట్టలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పక తప్పదు. ఈ ఉద్యమం ద్వారా తన రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడుని అప్రదిష్టపాలు చేయడం, బీజేపీతో తెదేపా సంబంధాలను దెబ్బతీయడం, రాష్ర్టంలో తన సత్తా చాటుకొని బీజేపీ దృష్టిని ఆకర్షించడం, వచ్చే ఎన్నికల వరకు తన పార్టీలో నేతలు, కార్యకర్తలు పక్క చూపులు చూడకుండా వారిని చైతన్యంగా ఉంచుతూ ఒక్క త్రాటిపై నడిపించడం, వైకాపాని ప్రజలకి మరింత చేరువ చేయడం వంటి అనేక కారణాలు, ప్రయోజనాలు ఇందులో ఇమిడి ఉన్నాయి.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు అయ్యే అవకాశం లేదనే చేదు నిజాన్ని రాష్ట్ర ప్రజలందరూ అంగీకరిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అంగీకరించడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడలు వంచయినా సరే తప్పకుండా ప్రత్యేక హోదా సాధిస్తానని చెపుతున్నారు. కానీ ప్రత్యేక హోదా మంజూరు చేయవలసిన ప్రధాని నరేంద్ర మోడీ గురించి ఒక్క ముక్క కూడా నోరు జారకుండా చాలా జాగ్రత్త పడుతుండటం గమనార్హం. మోడీ గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ఆయన చాలా లౌక్యంగా ‘కేంద్రం’ అంటుంటారు. అదే రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు అని పేరుపెట్టి మరీ విమర్శలు గుప్పిస్తుంటారు. ఆయన పోరాటం ఎవరిపై చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అదే తెలియజేస్తోంది.

రాష్ట్ర విభజన ప్రక్రియ దాదాపు పూర్తయిపోయిన తరువాత కూడా ప్రజలు తన పార్టీకి ఓటేసి అధికారం కట్టబెడితే కేంద్రం మెడలు వంచి రాష్ట్ర విభజనని నిలిపి వేయిస్తానని అని మభ్యపెట్టేవారు. ఒకసారి రాష్ట్ర విభజన జరిగిపోయిన తరువాత దానిని ఏవిధంగా నిలిపివేయదలచుకొన్నారో ఆయన ఎన్నడూ చెప్పలేదు. మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు ప్రజలందరూ తనకు మద్దతు ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తానని నమ్మబలుకుతున్నారు. ఆనాడు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ లక్షలాది ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్ధులు అందరూ రోడ్ల మీదకు వచ్చి దాదాపు మూడు నెలలు ఉద్యమాలు చేసినా కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడు గుప్పెడు మంది వైకాపా నేతలు ప్రత్యేక హోదా కోసం ఉద్యమించినంత మాత్రాన్న కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా మంజూరు చేస్తుందని ఆశించలేము.

అసలు జగన్ పోరాటంలో నిబద్దత ఉండదు కనుకనే ఆయన చేసిన ఏ పోరాటానికి ఆశించిన ఫలితం రావడం లేదని చెప్పవచ్చు. ప్రతీ సమస్యని కేవలం తన దృష్టి కోణంలో నుండే చూస్తూ, ప్రజలకు కూడా అలాగే చూపించే ప్రయత్నం చేస్తూ తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసమే జగన్ పోరాడుతుంటారు. ఒకవేళ ఆయన నిబద్దతగా ప్రజల తరపున పోరాడి ఉంటే ప్రజలే ఆయన వెంట నడిచేవారు. ఈవిధంగా ప్రజల మద్దతు కోసం జగన్ ఊరూర తిరగవలసిన అవసరం ఉండేదే కాదు.

గత 14 నెలల్లో ఆయన ఏ ఒక్క సమస్య గురించి పరిష్కారం అయ్యేవరకు పోరాడలేదు. ఆయనకు మంచి రాజకీయ మైలేజీ ఇవ్వగల రాజధాని భూసేకరణ సమస్యపై కూడా ఏకధాటిగా పోరాడలేకపోయారు. ఒకవేళ ఆయన రాజధాని గ్రామాలలో రైతుల తరపున గట్టిగా నిలబడి పోరాడి ఉండి ఉంటే ఆయన రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఎదగగలిగేవారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల కోసం శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఎక్కడో అక్కడ భూసేకరణ చేస్తూనే ఉంది. రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూనే ఉంది. ఒకవేళ జగన్ రాజధాని గ్రామాల రైతులకు అండగా నిలబడి నిలకడగా పోరాడి ఉండి ఉంటే, యావత్ రాష్ట్రంలో రైతులకు, గ్రామీణులకు దగ్గరయ్యేవారు. రైతుల ప్రయోజనాలు కాపాడినందుకు రాష్ట్ర ప్రజల ఆధారణ కూడా పొందగలిగేవారు. కానీ అనాలోచితంగా, నిలకడలేకుండా ముందుకు సాగుతున్న కారణంగా ప్రజలు కూడా ఆయన పోరాటాలను విశ్వసించలేక పోతున్నారు. అందుకే ప్రత్యేక హోదాపై ఆయన చేస్తున్న పోరాటాలకి కూడా రాష్ట్ర ప్రజలు స్పందించడం లేదు. వారి మద్దతు పొందలేకపోతున్నారని చెప్పవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close