బండారు లేఖ పిచుక మీద బ్రహ్మాస్త్రమే: జగన్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ మృతికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ లేఖ వ్రాయడమే కారణమని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అది పిచుక మీద బ్రహ్మాస్త్రం సంధించడమేనని అన్నారు. మిగిలిన నలుగురు విద్యార్ధులపై విధించిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని జగన్ డిమాండ్ చేసారు. లేఖ వ్రాసిన బండారు దత్తాత్రేయపై, దానిపై అతిగా స్పందించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీపై, ఆమె ఆదేశాలకు అనుగుణంగా విద్యార్ధులను సస్పెండ్ చేసిన వైస్ చాన్సిలర్ అప్పారావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేసారు.

చాలా మంది బీజేపీ వ్యతిరేక రాజకీయ పార్టీల నేతలు కూడా ఇదేవిధంగా డిమాండ్ చేసారు. అయితే ఏనాడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి నేడు ఈవిధంగా మాట్లాడటం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తీవ్రంగా ఉద్యమిస్తునప్పుడు కూడా ఆయన ఏనాడూ నేరుగా బీజేపీని కానీ కేంద్రప్రభుత్వాన్ని గానీ విమర్శించలేదు. అలాగే రాష్ట్రానికి ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్, పోలవరం వంటి హామీలపై ఆయన ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రభుత్వాన్నే నిలదీస్తుంటారు తప్ప వాటిని మంజూరు చేయవలసిన కేంద్రప్రభుత్వాన్ని ఏనాడు నిలదీయరు.

బహుశః భవిష్యత్ లో ఏదో ఒకరోజు బీజేపీ తెదేపాలు తెగతెంపులు చేసుకొన్నట్లయితే, అప్పుడు తాము బీజేపీతో జత కట్టాలనే ఉద్దేశ్యంతోనే ఆయన బీజేపీ, కేంద్రప్రభుత్వం పట్ల ఎన్నడూ మాట జారలేదు. కానీ ఇప్పుడు బీజేపీకి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులే రోహిత్ మృతికి కారణమని నేరుగా వారిపేర్లు పెట్టి ఆరోపిస్తుండటమే కాకుండా వారిరువురిపై తక్షణమే చర్యలు (?) తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురయినా తెదేపా,బీజేపీల బంధం నేటికీ అంతే పటిష్టంగా ఉండటంతో, ఇక బీజేపీ ఎన్నటికీ తమ పార్టీకి పొత్తులు కుదిరే అవకాశం లేదని భావిస్తున్నందునే జగన్మోహన్ రెడ్డి నేరుగా బీజేపీ మంత్రులను వేలెత్తి చూపిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారేమో? అనే అనుమానం కలుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close