నేటి నుండి ప్రత్యేక హోదా కోసం జగన్ నిరవధిక దీక్ష

ప్రత్యేక హోదా కోరుతూ నేటి నుండి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గుంటూరు శివార్లలో నల్లపాడు వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, సీనియర నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు, బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ తదితరులు గుంటూరులో మకాం వేసి దీక్ష స్థలంలో వేదిక ఏర్పాటు, జనసమీకరణ పనులను పూర్తి చేసారు. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుండి ఉదయం గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడి నుండి నేరుగా విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్లి దర్శనం చేసుకొన్న తరువాత అక్కడి నుండి దీక్షా వేదిక చేరుకొంటారు. ఈసారి ఆయన నగర శివార్లలో దీక్ష చేపడుతున్నారు కనుక పోలీసులు కూడా ఆయన దీక్షకి ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.

గత ఏడాదిన్నరగా ప్రత్యేక హోదా కోసం వైకాపా చేస్తున్న పోరాటాలు నేటి నుండి జగన్ చేపడుతున్న ఈ దీక్షతో కీలక దశకు చేరుకొందని వైకాపా చెపుతోంది. కానీ ఈ దీక్ష తరువాత వైకాపా భవిష్య కార్యాచరణను ఏవిధంగా ఉండబోతుందనే దానిని బట్టే ఫలితాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి తన దీక్షకు విద్యార్ధుల మద్దతు కోరారు. వారు మద్దతు ఇస్తారా లేదా? అనే సంగతి ఇప్పుడు తేలిపోతుంది. ఒకవేళ వారు మద్దతు ఇస్తే ఈ ఉద్యమం ఉదృతం అవుతుంది. లేకుంటే నాలుగయిదు రోజుల తరువాత పోలీసులు జగన్ దీక్షను భగ్నం చేయడంతో ముగిసిపోవచ్చును. ప్రత్యేక హోదా కోసం వైకాపా చేస్తున్న ఈ హడావుడి వలన రాష్ట్రంలో మళ్ళీ ఆత్మహత్యలు మొదలయ్యే ప్రమాదం మాత్రం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close