ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కోరుతూ జగన్ లేఖ

ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ కోరుతూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వాళ్ళ లేఖ వ్రాసారు. అక్టోబర్ 22న ప్రధాని ఆంద్రప్రదేశ్ కి వచ్చినప్పుడు గన్నవరం విమానాశ్రయంలో కానీ తిరుపతి విమానాశ్రయంలోగానీ తనకు, తన ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు ఎమ్మెల్సీలకు ఆయనను కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వమని తన లేఖలో అభ్యర్ధించారు. జగన్ తన లేఖలో ప్రత్యేక హోదా కోసం తను చేస్తున్న పోరాటాల గురించి వివరించి, ప్రజల ప్రయోజనం కోసమే గుంటూరులో తను దాని కోసం నిరాహార దీక్ష చేసినప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తన దీక్షని భగ్నం చేసిందని పిర్యాదు చేసారు. అయినా ప్రత్యేక హోదా సాధించేవరకు తమ పార్టీ నిరంతరంగా పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. ప్రధానమంత్రి అపాయింట్ మెంట్ ఇచ్చినట్లయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవలసిన అవసరం గురించి క్లుప్తంగా వివరించి, దాని కోసం ఒక మెమొరాండం ఆయనకు ఇచ్చేందుకే కొంత సమయం కేటాయించవలసిందిగా కోరుతున్నట్లు జగన్మోహన్ రెడ్డి తన లేఖలో తెలిపారు.

జగన్ చేస్తున్న పోరాటాల వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెంటికీ ఇంకా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసివస్తోంది. జగన్ తను చేస్తున్న పోరాటాల వలన రాష్ట్రంలో తెదేపా,బీజేపీలని ప్రజల ముందు దోషిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. మరి అటువంటప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకి అపాయింట్ మెంట్ ఎందుకు ఇస్తారు? అనే సందేహం ఎవరికయినా కలుగుతుంది. కానీ వైకాపాకి కలగడం లేదు. ఒకవేళ ప్రధాని సంప్రదాయాన్ని మన్నించి ఆయనకి అపాయింట్ మెంట్ ఇవ్వదలచుకొన్నా తను డిల్లీలో ఉన్నప్పుడు వచ్చి కలవమని చెప్పే అవకాశమే ఉంది తప్ప చంద్రబాబు నాయుడుని పక్కనబెట్టి జగన్మోహన్ రెడ్డికి అపాయింట్ మెంట్ ఇస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close