ఈ శుక్రవారం కూడా డుమ్మా..!

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో.. ఈ శుక్రవారం కూడా కోర్టుకు హాజరు కాలేదు. అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్లు ఆయన తరపు లాయర్లు సీబీఐ కోర్టుకు తెలిపారు. దీంతో.. కోర్టు విచారణను వచ్చే నెల ఆరో తేదీకి వాయిదా వేసింది. అక్రమాస్తుల కేసుల నిందితుల్లో ఒక్క శ్రీనివాసన్ మినహా ఎవరూ ఈ రోజు కోర్టుకు హాజరు కాలేదు. విజయసాయిరెడ్డి పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్నారు. మిగతా వారు కూడా.. ఏదో ఓ కారణం చెప్పి.. డుమ్మాకొట్టారు. దీంతో..విచారణ వాయిదా వేయాల్సిన పరిస్థితిని కోర్టుకు కల్పించినట్లుగా తెలుస్తోంది.

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు మినహాయింపు కోరి.. భంగపడినప్పటి నుండి.. ఆయన కోర్టుకు హాజరవుతారా.. కోర్టును ధిక్కరిస్తారా అన్న చర్చ సాగుతోంది. ఆయన ధిక్కరింపు బాటలోనే ఉన్నారని.. తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుండి.. ఆయన కోర్టు వైపు రాలేదు. అలాగని… కోర్టు మినహాయింపు కూడా ఇవ్వలేదు. ఏదో ఓ కారణం చెప్పి తప్పించుకుంటున్నారు. అయితే.. న్యాయవ్యవస్థతో ఇలా ఆటలు ఆడుకుంటే.. మొదటికే మోసం వస్తుందన్న భావన న్యాయవాద వర్గాల్లో ఉంది.

విచారణను కావాలనే.. ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలను.. జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ చేస్తోంది. ఇంత కాలం.. అనేక రకాల పిటిషన్లు వేసి.. అసలు కేసు విచారణలను ప్రారంభించకుండా అడ్డం పడ్డారని.. సీబీఐ పలు సందర్భాల్లో కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పుడు ఆయనకు కోర్టుకు విచారణకు హాజరు కాకపోతూండటంతో.. శరవేగంగా విచారణ కోసం.. రోజువారీ ట్రయల్స్ చేపట్టాలని కోరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. జగన్మోహన్ రెడ్డి రోజూ కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ కేసులో జగన్ కాస్త ధిక్కారంగా ఉంటూండటంతో కీలక పరిణామాలు ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close