జనసేన అభ్యర్థుల పరిశీలనకు స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు

ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉంది. అన్ని పార్టీలు ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చికల్లా అభ్యర్థులను ప్రకటించే ప్రణాళికలో ఉన్నాయి.  ఈ నేపథ్యంలో అభ్యర్థుల పరిశీలన కోసం జనసేన వినూత్న విధానాలను అవలంబించనుంది . ఇందులో భాగంగా ఎమ్మెల్యే ఎంపీ పదవికి పోటీ చేయాలి అనుకునే అభ్యర్థుల  దరఖాస్తుల పరిశీలన కోసం జనసేన స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.

పార్టీ తరపున పోటీ చేయాలనుకున్న అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన కోసం స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు గా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మాదాసు గంగాధరం, హరిప్రసాద్ లతో పాటు మరో ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎమ్మెల్యే లేదా ఎంపీ పదవికి పోటీ చేయాలనుకునేవారు దరఖాస్తులను పంపవచ్చని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వీరు పంపిన దరఖాస్తులను ఈ స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి, వడ పోత చేసి, ఎంపిక చేసిన దరఖాస్తులను జనరల్ బాడీ ముందు ఉంచుతారు. జనరల్ బాడీ ఇందులోంచి అభ్యర్థులను ఎంపిక చేసుకుని ఆయా స్థానాల్లో పోటికి నిలబెడతారు. ఈ స్క్రీనింగ్ కమిటీ విజయవాడ కేంద్రంగా పనిచేస్తుంది అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

ఏది ఏమైనా జనసేన పార్టీ ఆరంభం నుండి కూడా, కంటెంట్ రైటర్లు, సోషల్ మీడియా శతాగ్ని విభాగాలు అంటూ కొంత వైవిధ్యాన్ని చూపిన జనసేన , అభ్యర్థుల ఎంపికలో కూడా అదే తరహాలో వైవిధ్యాన్ని చూపనుందని అర్థమవుతుంది. అయితే ఇది ఎంతవరకు ఫలితాలనిస్తుందనేది ఎన్నికలయ్యాకే తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close