‘విరాగాలు’ 3 : జయహో దండనీతి

తగలేస్తే సమాజాన్ని దిగొస్తాయి సర్కారులు
నవ్యపథం చూపించిన జాట్‌ లందరికీ జయహో
ఆసేతు హిమాచలమూ.. అనేకమౌ జనరణాలు
హింస వినా దారి లేదను నవ గాంధీలకు జయహో

అహింసాత్మక ధర్నాలంటే నేడది పాత చింత పచ్చడే
ఇన్‌స్టంట్‌ రిజల్ట్‌ వాదులకు రోత పుట్టిస్తే జయహో
తలచినదెల్లా అడగడం, కాదంటే తన్ని తగలేయడం
అగ్గిపుల్ల సిద్ధాంతం.. పరిఢవిల్లుతోంది జయహో

జాట్‌లకు రిజర్వేషన్‌ అవసరమా? లేదా? జాట్ల డిమాండకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి రిజర్వేషన్‌ సదుపాయం కల్పించడానికి, దానికి అనుకూలంగా తదుపరి అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెడతామని హామీఇవ్వడం జరిగిపోయింది. జాట్‌లు రిజర్వేషన్‌ సాధించుకోవడం న్యాయాన్యాయాల గురించిన సమీక్ష పక్కన పెడితే.. వారు తమ డిమాండును సాధించుకున్న తీరు, అందుకు అనుసరించిన మార్గాలు మిగిలిన దేశానికి భయం పుట్టిస్తున్నాయి.

ఈ దేశంలో చాలా ప్రాంతాల్లో కులాలు- రిజర్వేషన్‌లకు సంబంధించి చాలా డిమాండ్లు ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో జాట్‌ల ఉద్యమం విపరీతమైన హింసను ప్రేరేపించిన నేపథ్యంలో వారికి తక్షణం రిజల్ట్‌ కనిపించడం అనేది దేశంలో మిగిలిన వారికి కూడా ఎక్కడ ప్రేరణ ఇస్తుందో అనే భయం కలుగుతోంది. అదే జరిగితే గనుక.. మొన్నటి తుని దుర్ఘటనల్ని తలదన్నే స్థాయిలో ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి డిమాండుతో ఆందోళనలు చేసేవారంతా.. ప్రభుత్వాన్ని సానుకూలంగా కనీసం అడగడానికంటె ముందు హింసాత్మక మార్గంతోనే ప్రారంభించే దుర్దినాలు మొదలవుతాయి. ఈ జాట్‌లు సాధించిన దాన్ని బట్టి ఆ భయమే ప్రజల్లో కలుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close