వైసీపీలోకి జయసుధ..! ఏపీలో ఏదో ఓ లోక్‌సభ స్థానం నుంచి పోటీ..?

ప్రముఖ సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్ పాండ్‌లో..జగన్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముంబైలో భర్త ఆత్మహత్య చేసుకున్న తర్వాత దాదాపుగా .. బయట కనిపించడం మానేశారు. సినిమాలు కూడా పరిమితంగా చేస్తున్నారు. ఈ తరుణంలో హఠాత్తుగా ఆమె వైసీపీలో చేరారు. నిజానికి ఆమె 2016లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఊరకనే కండువా కప్పుకున్నారు కానీ.. తర్వాత ఎక్కడా ఎలాంటి కార్యక్రమాల్లోనూ కనిపించలేదు. ఆ తర్వాత వ్యక్తిగత జీవింతలో ఇబ్బందులు రావడం.. తో యాక్టివ్ కాలేకపోయారు. జగన్ ఆదేశిస్తే.. ఏపీ ఎన్నికల్లో ఎక్కడి నుంచయినా కచ్చితంగా పోటీ చేస్తానని జయసుధ ప్రకటించారు.

టీఆర్‌ఎస్‌ ఒత్తిడితో వైసీపీలో చేరలేదని.. వైసీపీలోచేరేందుకు తనపై ఎవరి ఒత్తిడి లేదని.. వివరణ ఇచ్చారు. తనకు సినిమా తప్ప ఎలాంటి వ్యాపారాలు లేవన్నారు. వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఓ రకంగా సొంత ఇంటికి చేరినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. టీడీపీలో జాయిన్‌ అయ్యాను కానీ నేనేం చేయాలి.. నా విధులు ఏంటో ఎవరూ చెప్పలేదని … కాంగ్రెస్‌లో చేరినప్పుడు నేను ఎలా ఉండాలి..
ఏం చేయాలన్నది వైఎస్‌ చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. సికింద్రాబాద్‌ సీటు ఇచ్చి వైఎస్‌ ప్రోత్సహించారన్నారు. కాంగ్రెస్ తరపున గతంలో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి… తలసాని శ్రీనివాసయాదవ్‌పై జయసుధ విజయం సాధించారు.

కొడుకును హీరోగా పరిచయం చేసినప్పటి నుంచి…టీఆర్‌ఎస్‌తోనూ జయసుధకు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. రోజూ ఎవరో ఒకర్ని చేర్పించుకునే వ్యూహంలో భాగంగా.. జయసుధకు కూడా కండువా కప్పారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆమెకు టిక్కెట్ ఖరారు చేసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close