తెలంగాణాలో స్థానికులకి అవకాశాలు ఉండవా?

ఆంధ్రా పాలకుల చేతిలో తెలంగాణా ప్రాంతం, ప్రజలు, సహజవనరులు అన్నీ దోపిడీకి గురవుతున్నాయి కనుక తెలంగాణా రాష్ట్రం ఏర్పడితేనే న్యాయం జరుగుతుందని పోరాడి తెలంగాణా సాధించుకొన్నారు. తెలంగాణా కోసం పోరాడిన తెరాసయే ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటికీ రాష్ట్రంలో గల పరిశ్రమలలో, ఐటి కంపెనీలలో, వివిధ ఇతర సంస్థలలో తెలంగాణా ప్రజలకి ఉద్యోగాలు లభించడం లేదు. ప్రైవేట్ సంస్థలు నేటికీ స్థానికేతరులకే ప్రాధాన్యత ఇస్తున్నాయని ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. అన్ని సంస్థలలో 80శాతం ఉద్యోగాలు తెలంగాణా స్థానికులకే ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించాలని అయన కోరారు.

తెరాస అధికారంలోకి వచ్చిన కొత్తలో అన్నీ తెలంగాణా ప్రజలకే దక్కాలి అన్నట్లుగా మాట్లాడేది..వ్యవహరించేది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా నిర్వహించినపుడు స్థానికత అంశంపై చాల చర్చ జరిగింది. కానీ తెరాస ప్రభుత్వం అధికారంలో కుదురుకొన్న తరువాత దాని ఆలోచనలలో, ప్రాధాన్యతలలో చాలా మార్పు వచ్చింది. తెరాస ప్రభుత్వం ఎల్లప్పుడూ ఎన్నికలు, ఓట్లు, అధికారం సుస్థిరం చేసుకోవడం, అందుకోసం ప్రతిపక్ష పార్టీలలో ఫిరాయింపులని ప్రోత్సహించడం గురించే ఎక్కువగా ఆలోచిస్తోందనే విమర్శలు ఎదుర్కొంటోంది.

తెరాసయే రాష్ట్రంలో శాస్వితంగా అధికారంలో ఉండాలనే ఆలోచనతో సిద్దాంతాలని, తన ఆశయాలని, చివరికి తెలంగాణా కోసం పోరాడినవారిని కూడా పక్కనబెట్టి, ఎన్నడూ తెలంగాణా కోసం మాట్లాడని ప్రతిపక్ష పార్టీల నేతలని పార్టీలో చేర్చుకొని వారికే పదవులు కట్టబెట్టడంతో ఇప్పుడు తెరాస స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఎవరు రాష్ట్రానికి అన్యాయం చేశారని తెరాస వాదించేదో, ఇప్పుడు మళ్ళీ వారి చేతికే రాష్ట్ర పగ్గాలు అప్పగించిందని విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే తెరాస ప్రభుత్వంలో కూడా ‘స్థానికులకి’ అవకాశం లేకుండా పోయిందని స్పష్టం అవుతోంది.

ఇక తెలంగాణా అభివృద్ధి పేరిట రాష్ట్రంలో జరుగుతున్న నిర్మాణ పనులలో కూడా ఆంధ్రాకి చెందిన కాంట్రాక్టర్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సహజంగానే వారి సంస్థలలో ఆంధ్రావారికే ఉద్యోగాలలో ప్రాధాన్యత ఉంటే ఆశ్చర్యమేమీ లేదు. తెలుగు సినిమా రంగం మొదటి నుంచి ఆంధ్రాప్రాంతం వారి చేతిలోనే ఉంది కనుక దానిలోనూ ఆంధ్రావారికే ప్రాధాన్యత దక్కడం సహజమే. తెలంగాణాకి చెందిన జూనియర్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, ఇంకా వివిధ శాఖలకి చెందినవారు తమకి అన్యాయం జరుగుతోందని ఈ రెండేళ్లలో చాలాసార్లు రోడ్డెక్కిన సంగతి అందరికీ తెలిసిందే. ఉన్నత విద్యా, వైద్య, పారిశ్రామిక, వ్యాపార తదితర రంగాలు కూడా నేటికీ చాలా వరకు ఆంధ్రావారివే ఉన్నాయి. కనుక అక్కడా స్థానికులకి ప్రాధాన్యత తక్కువే ఉంటుందని చెప్పకతప్పదు. చివరికి తెలంగాణా న్యాయవ్యవస్థలో కూడా ఆంధ్రావారికే ప్రాధాన్యత ఇవ్వడంతో తెలంగాణా న్యాయవాదులు న్యాయం కోరుతూ రోడ్డెక్కడం అందరూ చూస్తూనే ఉన్నారు.

అంటే అటు ప్రభుత్వంలోను, ప్రైవేట్ సంస్థలలో కూడా స్థానికులకి అవకాశాలు దక్కడం లేదని స్పష్టం అవుతోంది. అంటే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ పరిస్థితులలో పెద్దగా మార్పు ఏమీ రాలేదని స్పష్టం అవుతోంది. దానినే ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close