నితిన్‌ను విందుకు పిలిచిన నడ్డా !

అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తే ఎన్టీఆర్‌ను విందుకు పిలిచారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురంభీం పర్‌పార్మెన్స్‌ను మెచ్చి ఆయనను షా విందుకు పిలిచారని చెప్పుకున్నారు. అక్కడ రాజకీయాలు మాట్లాడుకున్నారా లేదా అన్నదానిపై ఇప్పటికీ హైవోల్టేజ్ చర్చలు జరుగుతున్నాయి. ఈ సారి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు వస్తున్నారు. హన్మకొండలో జరగబోయే బహిరంగసభలో ప్రసంగించేందుకు ఆయన వస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి టాలీవుడ్‌లో నిలదొక్కుకున్న హీరో నితిన్‌తో భేటీ కావాలనుకున్నారు.

ఈ మేరకు సమాచారం పంపారు. నితిన్‌తో భేటీకి … చెప్పుకోవడానికి కారణం లేదు. మాచర్ల నియోజకవర్గం సినిమా చూసి … ఆయనను ప్రశంసించడానికి పిలిచారని చెప్పుకునే పరిస్థితి లేదు. కేవలం.. నితిన్‌తో భేటీ అవడం ద్వారా.. ఆయన బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారన్న ఓ అభిప్రాయాన్ని ప్రజల్లోకి పంపడానికి ప్రయత్నిస్తారు. అలాగే టాలీవుడ్‌కు చెందిన కొంత మంది ప్రముఖ రచయితలు… నటులతోనూ నడ్డా సమావేశం అయ్యే అవకాశం ఉంది.

ఇటీవల టాలీవుడ్ నుంచి విజయేంద్ర ప్రసాద్‌కు రాజ్యసభ సభ్యత్వం రావడంతో ఆయన ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారేమోకానీ.. టాలీవుడ్ మొత్తం బీజేపీ వైపు ఉందని చెప్పడానికి వేస్తున్న స్కెచ్‌లా ఈ వ్యవహారం ఉందన్న అభిప్రాయాలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close