5 హగ్స్ + 1 కిస్ = 13 మినిట్స్ ఎమోషన్.. సక్సెస్ మీట్ లో సరిగమ పదనిస..!

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత స్టైలిష్ గా, కొత్తగా తీసిన నాన్నకు ప్రేమతో మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో.. మూవీ యూనిట్ అంతా ఉబ్బి తబ్బిబ్బవుతోంది. సినిమా చూసిన వాళ్లంతా.. తారక్ ని ఆకాశానికెత్తేస్తున్నారు. తారక్ అలా చేశాడు.. ఇలా చేశాడు.. అద్భుతంగా చేశాడంటూ.. మెచ్చుకుంటున్నారు. అయితే ఈ సారి.. నాన్నకు ప్రేమతో సక్సెస్ మీట్ లో.. ఆ డ్యూటీని తారక్ తీసుకున్నాడు.

నాన్నకు ప్రేమతో మూవీలో యాక్ట్ చేసిన నటులని, టెక్నీషియన్లని పొగడ్తలతో ముంచెత్తాడు. సినిమా టైటిల్ కి తగ్గట్టే… చాలా ఎమోషనల్ గా మాట్లాడి.. అందరి గుండెలు పిండేశాడు. అయితే అంత ఎమోషన్ మధ్యలో కూడా.. కొంచెం కొత్తగా కనిపించిందో సీన్. జూనియర్ ఎవరి గురించి మాట్లాడితే.. వారంతా వచ్చి.. తారక్ ని హగ్ చేసుకుంటూ.. ఎమోషనల్ గా ఫీలయ్యారు. డైరెక్టర్ సుకుమార్, ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్.. ఇలా ఎవరి గురించి మాట్లాడినప్పుడు.. వారంతా లేచి.. తారక్ కి హగ్స్ ఇచ్చారు. దీంతో.. ఎమోషన్ కాస్తా.. కామెడీ అయిపోయింది. రాజేంద్రప్రసాద్ మరో అడుగు ముందుకేసి.. తారక్ కి ఓ కిస్ కూడా ఇచ్చాడు.

ఈ తతంగం అంతా తట్టకోలేక చివరకు అందర్నీ కూర్చోబెట్టే మాట్లాడాడు తారక్. రాజీవ్ కనకాల, శ్రీనివాస్‌ అవసరాలని పొగడ్తల్లో ముంచెత్తాడు. వాళ్లు కూడా లేచి హగ్ చేసుకోబోతే.. వారిని కూర్చోబెట్టేశాడు. ఇలా ఓ ఎమోషనల్ గా సాగిన సక్సెస్ మీట్ లో… చివరకు కామెడీగా ఎండ్ అవ్వడం చూసి.. అక్కడున్న అందరూ కూడా హ్యాపీగా ఫీలయ్యారు.

https://www.youtube.com/watch?v=e81s-8rmjrg

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close