‘సర్దార్‌’లో పవన్‌కు జోడిగా కాజల్!

హైదరాబాద్: ‘సర్దార్’లో పవన్ సరసన నటించే హీరోయిన్‌ ఎవరనేదానిపై కొంతకాలంగా నెలకొన్న అస్పష్టత తొలగిపోయింది. కాజల్‌ను నిర్మాతలు బుక్ చేశారు. గబ్బర్‌సింగ్‌కు పార్ట్-2గా వస్తున్న సర్దార్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మితమైన సెట్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. పవర్ ఫేమ్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను సంక్రాంతికి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాలకు దేవి సూపర్ హిట్ సంగీతం అందించటంతో సర్దార్ చిత్రానికి సంబంధించి అతనిపై ఎంతో అంచనాలు ఉన్నాయి. మరోవైపు పవన్ నుంచి పూర్తిస్థాయి చిత్రం వచ్చి రెండేళ్ళుకావటంతో(గోపాల గోపాలలో పవన్ ప్రధాన పాత్రధారి కాదు) అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు మారటంవలన, జనసేన వలన ఈ ప్రాజెక్ట్ చాలాకాలం స్క్రిప్ట్ దశలోనే ఆగిపోయింది. ఇటీవలే పట్టాలకెక్కటంతో అభిమానులు ఆనందిస్తున్నారు.

మరోవైపు సర్దార్ చిత్రంతో కాజల్ ఖాతాలోకి మరో పెద్ద ప్రాజెక్ట్ చేరినట్లయింది. ఇటీవల ఎన్‌టీఆర్ సరసన టెంపర్‌లో నటించిన కాజల్, బ్రహ్మోత్సవంలో మహేష్ పక్కన బుక్ అయ్యింది. మరోవైపు లారెన్స్ తీస్తున్న కాంచన-3 కూడా అంగీకరించింది. మొత్తానికి కాజల్ పని జోరుగానే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జైల్లో కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నారు…ఈడీ కొత్త ఆరోపణ

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవల్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది ఈడీ. వైద్య పరమైన సాకులతో బెయిల్ పొందేందుకుగాను కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లు ఉద్దేశ్యపూర్వకంగా...

తొలి రోజు నామినేషన్లకు ఆసక్తి చూపని వైసీపీ నేతలు

ఏపీలో నామినేషన్ల సందడి తొలి రోజు అంతా పసుపు హడావుడి కనిపించింది. కూటమిలోని పలువురు కీలక నేతలు తొలి రోజు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు...

తలసాని డుమ్మా – బాపు కేసీఆర్‌కు షాక్ ఇవ్వడమే తరువాయి !

బాపు కేసీఆర్ కు.. గట్టి షాక్ ఇచ్చేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ రెడీ అయినట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వ్యూహం ఖరారు కోసం నిర్వహించిన సమావేశానికి తలసాని శ్రీనివాస్...

జగన్‌కు శత్రువుల్ని పెంచడంలో సాక్షి నెంబర్ వన్ !

ఎన్నికల సమయంలో జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడేవారి సంఖ్యను పెంచడంలో సాక్షి పత్రిక తనదైన కీలక భూమిక పోషిస్తుంది. ఎవరైనా తమను విమర్శిస్తున్నారో.. లేకపోతే టీడీపీకి మద్దతుదారుడని అనిపిస్తే చాలు వాళ్లపై పడిపోయి.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close