వెంక‌టేష్‌తో కాజ‌ల్‌?

వెంక‌టేష్ స‌ర‌స‌న కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తోందా?? అవున‌నే అంటున్నాయి ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు. వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా, తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇందులో క‌థానాయిక‌గా కాజ‌ల్‌ని ఎంచుకొన్నార‌ని తెలుస్తోంది. కాజ‌ల్‌కి బాగా అచ్చొచ్చిన ద‌ర్శ‌కుడు తేజ‌. త‌న తొలి సినిమా తేజ ద‌ర్శ‌క‌త్వంలోనే. 50వ చిత్రం (నేనే రాజు నేనే మంత్రి) కూడా తేజతోనే. ఇప్పుడు మ‌రోసారి తేజ‌తో క‌ల‌సి ప‌నిచేయ‌బోతోందని స‌మాచారం. కాజ‌ల్ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టి ఇంత‌కాల‌మైనా… వెంకీతో క‌ల‌సి ప‌నిచేయ‌లేదు. ఈ సినిమాతో ఆ లోటు తీర‌బోతోంది. ఇదో ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తోంది. భార్యా భ‌ర్త‌ల అనుబంధం నేప‌థ్యంలో సాగుతుంద‌ట‌. ఉమ్మ‌డి కుటుంబాల మ‌ధ్య అనుబంధాల్ని తేజ త‌న‌దైన స్టైల్‌లో తీర్చిదిద్ద‌బోతున్నార‌ని తెలుస్తోంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఏకే ఎంట‌న్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ నెల ద్వితీయార్థంలో సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close