‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’ గురించి మాట్లాడ‌లేదేంటి..?

‘ఎన్టీఆర్‌’ బ‌యోపిక్లో కీల‌క పాత్ర పోషించాడు క‌ల్యాణ్ రామ్‌. తండ్రి హ‌రికృష్ణ పాత్ర త‌న‌కే ద‌క్క‌డం, బాబాయ్‌తో క‌ల‌సి వెండి తెర పంచుకోవ‌డం…. క‌ల్యాణ్ రామ్‌ని ఉత్సాహ‌ప‌రుస్తున్న అంశాలు. అందుకే.. మీడియాని పిలిచి ఇంట‌ర్వ్యూలు ఇచ్చాడు. ఈ ఇంట‌ర్వ్యూలలో షూటింగ్ అనుభ‌వాల‌నూ, బాబాయ్‌తో త‌న‌కున్న అనుబంధాన్ని బాగానే పంచుకున్నాడు.కానీ ఒకే ఒక్క ప్ర‌శ్న‌కు మాత్రం స‌మాధానం దాటేశాడు. అదే.. ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’.

ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి పోటీగా వ‌ర్మ తీస్తున్న సినిమా ఇది. ‘ఎన్టీఆర్‌’లో దాచేసిన నిజాల్ని.. ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’లో చూపించి తీర‌తా.. అని గ‌ట్టిగా చెబుతున్నాడు వ‌ర్మ‌. ఈ సినిమా అనేక వివాదాల‌కు కేంద్ర బిందువు కానుంది. ఈ సినిమాపై మాత్రం క‌ల్యాణ్ రామ్ స్పందించ‌డానికి నిరాక‌రించాడ‌ని టాక్‌. ‘మీకు పోటీగా వ‌ర్మ‌ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్నాడు క‌దా.. దానిపై మీ అభిప్రాయం ఏమిటి?’ అనే ప్ర‌శ్న‌కు క‌ల్యాణ్ రామ్ స‌మాధానం ఇవ్వ‌లేద‌ట‌. ‘అలాంటి సినిమాల గురించి మాట్లాడ‌కుండా ఉండ‌డ‌మే మంచిది’ అంటూ క్లుప్తంగా ముగించాడ‌ని తెలుస్తోంది. ఓ విధంగా అదీ మంచిదే. ఇప్పుడు నంద‌మూరి క‌థానాయ‌కులు ఆ సినిమా గురించి ఏం మాట్లాడినా… వ‌ర్మ దాన్నీ ప్ర‌చారానికి వాడుకుంటాడు. ఆ అవ‌కాశం ఇవ్వకుండా జాగ్రత్త ప‌డ్డాడు క‌ల్యాణ్ రామ్. క‌నీసం బాల‌య్య అయినా ఈ విష‌య‌మై పెద‌వి విప్పుతాడేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close