విరాళాలకు మించిన ఔదార్యం

కరోనా విపత్తు దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి చూస్తున్నాం కదా. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో మరణాల సంఖ్య తక్కువే అయినా బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వార్డులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పటికీ ఇతర రోగులకు అది ఇబ్బందికరం, ప్రమాదకరం. దీంతో ప్రభుత్వాలు కొన్ని ఆసుపత్రులను ప్రత్యేకంగా కరోనా ఆసుపత్రులుగా మార్చేస్తున్నాయి. ఈ పరిస్థితి పలు రాష్ట్రాల్లో కనబడుతోంది. హైదరాబాదులోని గాంధీ ఆస్పత్రిని పూర్తిగా కరోనా ఆస్పత్రిగా మార్చేసింది ప్రభుత్వం. ఇలా చాలా రాష్ట్రాల్లో జరుగుతోంది. అయితే దేశంలో పెరుగుతున్న కరోనా రోగుల సంఖ్యను చూస్తుంటే ఈ ఆస్పత్రులు సరిపోవేమోననే అనుమానం కలుగుతోంది. కరోనా వైరస్ మొదలైన తొలినాళ్లలోనే చైనా కేవలం పది రోజుల్లోనే వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మించి రికార్డు సృష్టించింది. మన దేశంలో అలా చేయడం సాధ్యం కాదు. కానీ ఉన్న ఆస్పత్రులనే కరోనా ఆసుపత్రులుగా మార్చవచ్చు. అలా ఎన్నింటిని మారుస్తారు? ఇతర రోగాలతో బాధపడేవారికి కూడా వైద్యం చేయాలి కదా. ప్రాణాపాయంలో ఉన్న వారికి ఆపరేషన్లు చేయాలి కదా. ఓ పక్క కరోనా రోగులకు చికిత్స చేయాలి. మరోపక్క ఇతర రోగాలు వచ్చినవారికి వైద్యం అందించాలి. నిజంగా ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. దీన్ని తమిళ సూపర్ స్టార్లలో ఒకడైన కమల హాసన్, మరో నటుడు పార్తీబన్ గమనించారేమో. వారిద్దరూ ప్రభుత్వం అవసరమైతే తమ ఇళ్లను కరోనా ఆసుపత్రులుగా మార్చుకోవచ్చని, అందుకు తమకు అభ్యంతరం లేదని మీడియా ముఖంగా ప్రకటించారు. ఇది వారి ఔదార్యానికి నిదర్శనం. అన్ని భాషల నటీ నటులు, టెక్నీషియన్లు తమ శక్తి కొద్దీ విరాళాలు ప్రకటిస్తున్నారు. ఎలాంటి విపత్తు వచ్చినా విరాళాలు ఇవ్వడం మామూలే. కానీ తమ ఇళ్లనే ఆసుపత్రులుగా మార్చుకోవాలని చెప్పేవారు ఎవరుంటారు? ఇది నిజంగా గ్రేట్ కదా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close