అమరావతి శంకుస్థాపనపై స్పందించిన కమలహాసన్

హైదరాబాద్: తెలుగువారు అదృష్టవంతులని సుప్రసిద్ధ నటుడు కమలహాసన్ అన్నారు. తెలుగు మాట్లాడేవారికి రెండు రాజధానులు ఉండటం అదృష్టమని చెప్పారు. ఇండియాలో ఒకే భాష మాట్లాడేవారికి రెండు రాజధానులు ఉండటం చాలా అరుదైన విషయమని, దక్షిణాదిన ఆ ఘనత తెలుగువారికి మాత్రమే దక్కిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందినా అనివార్యకారణాలవలన వెళ్ళలేకపోయానని చెప్పారు. అమరావతి నగరం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటుందని తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నట్లు తెలిపారు.

మరోవైపు నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన విశాల్‌కు, ఆయన బృందానికి ఎలాంటి సహకారం అందించటానికైనా సిద్ధంగా ఉన్నానని కమల్ చెప్పారు. సంఘంలో తనకు ఎలాంటి గౌరవ పదవులూ అవసరంలేదని స్పష్టం చేశారు. నడిగర్ సంఘం పేరును అలాగే కొనసాగించాలని కమల్ సూచించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close