కారెం చేతికి ఎస్సీ పగ్గాలు : బాబు కొత్త వ్యూహం!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్‌ ఏర్పాటు అయింది. మాల వర్గానికి చెందిన ప్రముఖ ఎస్సీ నేత కారెం శివాజీని ఈ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్‌కు అధ్యక్షుడిగా నియమిస్తూ చంద్రబాబునాయుడు ఉత్తర్వులు జారీచేశారు. ఆయన ఈ పదవిలో మూడేళ్లపాటూ కొనసాగుతారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి ఈ కార్పొరేషన్‌ పనిచేస్తుంది. ఆ సామాజిక వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కేటాయించే నిధులన్నీ ఈ కార్పొరేషన్‌ ద్వారా కేటాయింపులు జరుగుతాయి. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్‌ గురించి చాన్నాళ్ల కిందట హామీ ఇచ్చిన చంద్రబాబు ఇన్నాళ్లకు దాన్ని ఆచరణలో పెట్టారు.

అయితే మాల వర్గానికి చెందిన కారెం శివాజీని ఈ పదవిలో కూర్చోబెట్టడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎస్సీల్లో ఏబీసీడీల వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పటినుంచి మాదిగ వర్గంలో చంద్రబాబునాయుడుకు కొంత అనుకూలత ఉంది. గత ఎన్నికల సమయానికి మాదిగవర్గం చంద్రబాబుకు, మాల వర్గం జగన్‌కు అనుకూలంగా ఉంటారనే అంచనాలు సాగాయి. అయితే ఆ వర్గీకరణ కార్యరూపం దాల్చలేదు. దానికి తాను వ్యతిరేకం కాదంటూ ఆయన ఆ విషయాన్ని న్యాయపరమైన చిక్కుల సాకుతో పక్కన పెట్టారు.

ఇటీవలి కాలంలో మాదిగనేత మందకృష్ణ చంద్రబాబు మీద కారాలు మిరియాలు నూరడం మాత్రమే కాదు.. వైఎస్‌ జగన్‌ కోటరీకి దగ్గరై ఇంచుమించుగా చంద్రబాబు మీద ప్రత్యక్ష పోరాటానికి దిగుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు మాల వర్గానికి చెందిన కారెం శివాజీ చేతికి ఎస్సీఎస్టీ కార్పొరేషన్‌ పగ్గాలు ఇవ్వడం కీలకమైన నిర్ణయం. జగన్‌కు బలం ఉన్న సామాజిక వర్గాన్ని తనవైపు ఆకట్టుకోవడంతో పాటు, మందకృష్ణ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని కూడా చంద్రబాబు వ్యూహాత్మకంగా ఇలా పావులు కదిపారని పలువురు అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close