కర్ణాటక ఉపఎన్నికల్లో బీజేపీకి షాక్..! కాంగ్రెస్ – జేడీఎస్‌కు ముందే దీపావళి..!!

కర్ణాటకలో మూడు పార్లమెంట్, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఒక్క చోట మినహా మిగిలిన నాలుగు చోట్ల కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బీజేపీ సిట్టింగ్ స్థానం అయిన… బళ్లారిలో కాంగ్రెస్ పార్టీ లక్షన్నర ఓట్లకుపైగా మెజార్టీతో ఆధిక్యత ప్రదర్శించడం.. సంచనలం సృష్టిస్తోంది. దశాబ్దాలుగా… బళ్లారిని గుప్పిట్లో పెట్టుకున్న గాలి జనార్దన్ రెడ్డి వర్దం ఈ సారి కూడా.. తమ పట్టు నిరూపించుకుని.. కర్ణాటక వ్యాప్తంగా బీజేపీ వేవ్ ఉందని నిరూపించే ప్రయత్నం చేసి.. బోర్లా పడ్డారు. గాలి జనార్ధన్ రెడ్డి అనుంగు అనుచరుడు బి.శ్రీరాములు సోదరి శాంతను.. బళ్లారిలో అభ్యర్థిగా నిలిపారు. బి.శ్రీరాములు.. ఆరు నెలల పదవి కాలం అయినా సరే.. తీవ్ర స్థాయిలో విజయం కోసం ప్రయత్నించారు. సాధారణ ఎన్నికల్లో ఖర్చు పెట్టినట్లుగా.. నోట్ల ప్రవాహం పారించారు. కానీ ఏ మాత్రం… కాలం కలసి రాలేదు. బళ్లారిలో కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్పకు… భారీ విజయం వరించింది. దీంతో బళ్లారిలో… గాలి బ్రదర్స్ హయాంలో అంతమైనట్లేనని అనుకోవచ్చు.

ఇక బీజేపీ ఆశలు పెట్టుకున్న మరో అసెంబ్లీ స్థానం జమాఖండి. గత ఎన్నికల్లో.. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్తి సిద్ధు న్యామగౌడ కేవలం మూడు వేల ఓట్ల ఆధిక్యతతో బీజేపీపై గెలిచారు. అయితే అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో.. ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానాన్ని గెల్చుకుంటే.. రాజకీయ పరిస్థితులు మారిపోతాయని.. బీజేపీ నేత యడ్యూరప్ప ఆశపడ్డారు. జమాఖండిలోనే మకాం వేసి… ఎన్నికను పర్యవేక్షించారు. కానీ…. అనువైన ఫలితం రాలేదు. కానీ మెజార్టీ మాత్రం దాదాపుగా 40వేలకు పెరిగిపోయింది. ఇక మరో అసెంబ్లీ స్థానం రామనగరలో బీజేపీ ముందే చేతులెత్తేసింది. ఆ పార్టీ అభ్యర్థి పోలింగ్‌కు రెండు రోజుల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అక్కడ్నుంచి.. సీఎం కుమారస్వామి సతీమణి.. అనితా కుమారస్వామి దాదాపుగా లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో కుమారస్వామి రెండు స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రామనగరకు రాజీనామా చేశారు. ఇప్పుడా స్థానం నుంచి ఆయన సతీమణి విజయం సాధించారు.

ఇక మాండ్యా లోక్‌సభ నియోజకవర్గంలో… జేడీఎస్ అభ్యర్థికి తిరుగులేకుండా పోయింది. నిజానికి అక్కడ.. కాంగ్రెస్ వర్సెస్ జేడీఎస్ అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. బీజేపీకి అక్కడ బలం లేదు. కాంగ్రెస్, జేడీఎస్ కలిపి.. జేడీఎస్ అభ్యర్థిని నిలబెట్టాయి. దాంతో ఆ స్థానంలో బీజేపీ ఆశలు పెట్టుకోలేదు. ఓట్లు పెరుగుతాయని ఆశ పడింది. కానీ అదీ జరగలేదు. ఇక బీజేపీకి.. ఊరటనిచ్చిన ఒకే ఒక్క స్థానం శివమొగ్గ లోక్‌సభ స్థానం. ఈ స్థానం నుంచి గతంలో యడ్యూరప్ప ఎంపీగా ఉండేవారు. ఎమ్మెల్యేగా ఎన్నికయిన తర్వాత రాజీనామా చేశారు. ఉపఎన్నికల్లో ఆయన కుమారుడు రాఘవేంద్రను.. అభ్యర్థిగా నిలబెట్టారు. గత లోక్ సభ ఎన్నికల్లో మూడున్నర లక్షల ఓట్ల మెజార్టీ సాధించిన యడ్యూరప్ప ఈ సారి కుమారుడికి… యాభై వేల ఓట్ల మెజార్టీ కూడా సంపాదించి పెట్టలేకపోయారు. ఈ ఫలితాలను విశ్లేషిస్తే.. బీజేపీకి కర్ణాటకలో గడ్డు పరిస్థితి ఎదురవడం ఖాయంగా కనిపిస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close