టీఆర్ఎస్, బీజేపీ పిలిచినా టీడీపీలోకి కాసాని జ్ఞానేశ్వర్ !

కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ . తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఈయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఇటీవల ఆయన ఇంటికి వెళ్లి హరీష్ రావు మాట్లాడారు. దాంతో ఆయన టీఆర్ఎస్‌లోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన ఇంటికి ఈటల రాజేందర్ వెళ్లి మాట్లాడారు. దాంతో ఆయన బీజేపీకి వెళ్తారని చెప్పుకున్నారు. ఒకే సామాజికవర్గం కావడంతో రాజేందర్ పిలిచాడైనా వెళ్తారని అనుకున్నారు. కానీ కాసాని ఏం ఆలోచించాడో కానీ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు.

టీడీపీలో చేరాలని ఉందని ఆయన సమాచారం పంపడం.. దానికి చంద్రబాబు అంగీకరించడం జరిగిపోయాయి. అసలు తెలంగాణలో టీడీపీ ఉందో లేదో అనుకునే పరిస్థితి. నేతలంతా పోవడమే కానీ చేరేవారు లేరు. కానీ ఇటీవల టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ మారిన తర్వాత తెలంగాణలోని కొంత మంది నేతలు టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరిగింది. మునుగోడు టిక్కెట్ ఇస్తే మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చేరుతారని చెప్పుకున్నారు.

కానీ వచ్చే ఎన్నికలకు పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్న చంద్రబాబు… మునుగోడు ఉపన్నికలో పోటీకి ఆసక్తి చూపించలేదు.దాంతో ఆయన చేరలేదు. ఇప్పుడు కాసాని చేరుతున్నారు. మరికొంత మంది కూడా వచ్చి చేరితే.. టీడీపీ మళ్లీ యాక్టివ్ అవుతుందన్న సంకేతాలు వస్తాయి. అయితే కాసానికి కండువా కప్పడానికి అటు టీఆర్ఎస్.. ఇటు బీజేపీ రెడీగా ఉన్నా.. ఆయన కావాలని టీడీపీలో ఎందుకు చేరారో మరి. కాసాని ఒకప్పుడు టీడీపీలోనే వెలుగు వెలిగిన నేతే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close