క‌త్తిమ‌హేష్ క‌న్నుమూత‌

న‌టుడు, సినీ విమ‌ర్శ‌కుడు, ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేష్ క‌న్నుమూశారు. ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో క‌త్తి మ‌హేష్ తీవ్రంగా గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. గ‌త కొద్ది రోజులుగా చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న క‌త్తిమ‌హేష్ కొద్దిసేప‌టి క్రితం తుది శ్వాస విడిచారు. రెండు వారాల క్రితం నెల్లూరు ద‌గ్గ‌ర జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో క‌త్తిమ‌హేష్‌కి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ప్ర‌మాదంలో ఆయ‌న కంటి చూపు కోల్పోయార‌ని వార్త‌లొచ్చాయి. అయితే… క‌త్తిమ‌హేష్ కోలుకుంటున్నారని, ఆయ‌న త్వ‌ర‌లోనే సంపూర్ణ ఆరోగ్యంతో బ‌య‌ట‌కు వ‌స్తార‌ని స‌న్నిహితులు చెబుతూ వ‌చ్చారు. కొద్ది రోజులుగా క‌త్తి మ‌హేష్ ఆరోగ్యం గురించి ఎలాంటి అప్ డేట్ బ‌య‌ట‌కు రావ‌డం లేదు. దాంతో క‌త్తిమ‌హేష్ ఆరోగ్యం కుదుట‌ప‌డింద‌ని అనుకున్నారంతా. అంత‌లోనే… ఇప్పుడు మ‌ర‌ణ‌వార్త వినాల్సివ‌చ్చింది. విమ‌ర్శ‌కుడిగా చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టిన క‌త్తి మ‌హేష్ `పెస‌రెట్టు` సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారారు. కొన్ని చిత్రాల్లోనూ న‌టించారు. ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త జీవితంపై ఆయ‌న చేసిన కొన్ని వ్యాఖ్య‌లు విమర్శ‌ల‌కు దారి తీశాయి. హిందుత్వంపై, రాముడిపై క‌త్తి చేసిన వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. బిగ్ బాస్ లోనూ అడుగుపెట్టిన మ‌హేష్‌… త‌న‌కంటూ ఓ అభిమాన వ‌ర్గాన్ని సృష్టించుకున్నారు. వైకాపా మ‌ద్ద‌తుదారుడిగానూ ఆ పార్టీ త‌ర‌పున మాట్లాడారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

అప్పుల క‌న్నా ప‌న్నులే ఎక్కువ‌… ప‌వ‌న్ ఆస్తుల లిస్ట్ ఇదే!

సినిమాల్లో మాస్ ఇమేజ్ ఉండి, కాల్ షీట్ల కోసం ఏండ్ల త‌ర‌బ‌డి వెయిట్ చేసినా దొర‌క‌నంత స్టార్ డ‌మ్ ఉన్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్. పిఠాపురం నుండి పోటీ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్...

పదేళ్ల తర్వాత పండగొచ్చిందా…ఇదేనా ప్రజాస్వామ్యపంథా..!?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ - టీవీ9 రజినీకాంత్ ఇంటర్వ్యూ తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ ఇంటర్వ్యూకు బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close