ఢిల్లీ లిక్కర్ స్కాంలో నెక్ట్స్ టార్గెట్ కవితే !?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్నారు. సౌత్ లాబీలో కీలకమైన వ్యక్తుల్ని సీబీఐ, ఈడీ మార్చి మార్చి అరెస్టు చేసుకుంటూ వెళ్తున్నాయి. ఇక మిగిలింది అరుణ్ రామచంద్ర పిళ్లై, కల్వకుంట్ల కవిత మాత్రమే. అరుణ్ రామచంద్ర పిళ్లైను బినామీగా పెట్టి కవిత ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ చేశారని చార్జిషీట్, రిమాండ్ రిపోర్టుల్లో దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఆ ప్రకారం తర్వాత వీరే టార్గెట్ కావొచ్చని అంచనా వేస్తున్నారు.

నిజానికి అరుణ్ రామచంద్ర పిళ్లైను ఎప్పుడో అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ సీబీఐ ప్లాన్ మార్చింది. ఆయనను అరెస్ట్ చేయడం లేదు. కానీ ఆయన అప్రూవర్ గా మారబోతున్నారన్న లీకులు వచ్చాయి. ఇది సంచలనం అవుతోంది. నిజంగానే అరుణ్ రామచంద్ర ఫిళ్లై అప్రూవర్ గా మారితే… తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు నమోదవుతాయి. ప్రధానంగా కవిత ఇరుక్కుపోతారని అంటున్నారు. ఈ వ్యవహారంలో సీబీఐ, ఈడీ ముందు ముందు తీసుకునే నిర్ణయాలు అందిరలో ఉత్కంఠ రేపుతున్నాయి.

ఇప్పటికే సీబీఐ ఓ సారి కవితను ప్రశ్నించారు. అదే సమయంలో పిలిచినప్పుడు రావాలని మరోసారి నోటీసులు ఇచ్చారు. కానీ మళ్లీ ఇంత వరకూ పిలువలేదు. ఇప్పుడు పిలిచే సమయం దగ్గర పడిందని చెబుతున్నారు. ఈ సారి విచారణకు సీబీఐ వాళ్లు రారు… కవితే వెళ్లాల్సి ఉంటుందని అంటున్నారు . అదే జరిగితే…. అరెస్టుకూ చాన్స్ ఉంది. ఇటీవల అరెస్టులన్నీ విచారణకు పిలిచే చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close