బాబు లేఖలు రాశారు.. రాకుండా అడ్డుకోండి..! ఖమ్మంలో కేసీఆర్ పిలుపు..!!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీపై లేఖాస్త్రం సంధించారు. చంద్రబాబునాయుడు ఖమ్మం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని… ఫిర్యాదు చేస్తూ.. కేంద్రానికి లేఖ రాశారని.. ఓ లేఖను ప్రదర్శించారు. సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందని .. ఆ సీతారామ ప్రాజెక్టు వద్దంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాశారన్నారు. ప్రచారానికి వచ్చే చంద్రబాబును ఖమ్మం ప్రజలు నిలదీయాలన్నారు. ఏ ముఖం పెట్టుకుని ఖమ్మం జిల్లాలో టీడీపీ అభ్యర్థులు పోటీచేస్తున్నారని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాకు ప్రమాదం పొంచి ఉందని .. సీతారామ ప్రాజెక్టును వ్యతిరేకించేవారిని చిత్తుగా ఓడించాలన్నారు. అందులో ఏమున్నదో కానీ.. ఆ లేఖను.. వెనక్కి తీసుకున్న తర్వాత చంద్రబాబు ఖమ్మం జిల్లాకు రావాలనన్నారు. లేకపోతే.. ఖమ్మం జిల్లా ప్రజలు చంద్రబాబును ఎక్కడిక్కడ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇంత కాలం పాలించిన కాంగ్రెస్, టీడీపీలు ఖమ్మం జిల్లాను ఎండబెట్టాయన్నారు. విపక్షాల మాయమాటలను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం జిల్లాలో 10 స్థానాలను టీఆర్ఎస్‌ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 100 శాతం మ్యానిఫెస్టోను అమలు చేసిన ఘనత టీఆర్ఎస్‌దేనని కేసీఆర్ ప్రకటించారు. నిర్మాణంలో 2లక్షల 70వేల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఉన్నాయన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు..కాంగ్రెస్‌, టీడీపీ కట్టిన 7ఇళ్లతో సమానమని.. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామని ప్రకటించారు. 6నెలలు ఆలస్యమైనా పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. పక్కనే గోదావరి ఉన్నా ఖమ్మం జిల్లాలో కరువు తాండవిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, టీడీపీ నేతలు ఖమ్మం జిల్లాకు ఎందుకు సాగునీరు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. ఆంధ్రాకు నీళ్లు తీసుకెళ్లేందుకే దుమ్ముగూడెం, సాగర్‌ టెయిల్‌పాండ్‌లు తెచ్చారని విమర్శించారు. దేశానికి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు పనికిరావని ..మోదీకి అధికారం ఇస్తే పనిచేయలేక చతికలపడ్డారని విమర్శించారు. కేంద్రంలో చక్రం తిప్పుతా.. తోక తిప్పుతా అని చెప్పనని సెటైర్ వేసారు.

వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో క్రీయాశీలకంగా మారుతామన్నారు. టీడీపీ అభ్యర్థి నామాను గెలిపిస్తే ప్రజలకు నామాలు పెడతారని హెచ్చరించారు. కేసీఆర్ గతంలో సభల్లో ప్రసంగించినట్లుగా.. చంద్రబాబుపై పరుషమైన వ్యాఖ్యలు చేయలేదు. కానీ.. కుల, మతాలు మనకు అన్నం పెట్టవని ప్రజలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కేసీఆర్ ప్రచారంలో… తాము ఖమ్మం జిల్లాను క్లీన్ స్వీప్ చేస్తామన్న శబ్దాలు వచ్చాయి.. కానీ అంత కాన్ఫిడెన్స్ మాత్రం కనిపించలేదు. చంద్రబాబునే టార్గెట్ చేసుకున్నారు. టీఆర్ఎస్ గెలవకపోతే.. ఖమ్మం జిల్లాకు ఏదో జరిగిపోతుందన్న భావన ప్రజలకు కల్పించడానికి ప్రయత్నించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close