“నీటి వాటా” కేటాయింపే అపెక్స్‌లో కేసీఆర్ ఎజెండా..!

ఆరో తేదీన అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించాలని కేంద్రజలశక్తి శాఖ మంత్రి నిర్ణయించడంతో సమర్థవంతమైన వాదన వినిపించాలని తెలంగాణ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ తెలంగాణకు నీటి కేటాయింపులు చేయలేదు. ఇదే అంశాన్ని అపెక్స్ భేటీలో హైలెట్ చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. రాష్ట్రాల పునర్విభజన చట్టాల ప్రకారం దేశంలో ఎప్పుడైనా కొత్త రాష్ట్రం ఏర్పడితే వెంటనే ఆ రాష్ట్రానికి నీటిని కేటాయించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకూ అధికారికంగా తెలంగాణకు నీటి కేటాయింపులు లేవు.

తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడితే జూన్ 14న నీటి కేటాయింపులు జరపాలని ప్రధాన మంత్రికి కేసీఆర్ లేఖ రాశారు. ఏపీ, తెలంగాణ మధ్య అయినా.. లేకపోతే నదీపరివాహాల ప్రాంతాల్లోని మొత్తం రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరపాలని కోరాము. ఏడేళ్లు గడుస్తున్నా స్పందన లేదని కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. అపెక్స్ సమావేశాల పేరిట హడావుడి చేస్తున్నారు కానీ కేంద్రం ఏమీ చేయడం లేదని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా గట్టిగా ఎండగట్టాలని… తెలంగాణాకు నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని పట్టుపట్టాలని కేసీఆర్ నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్ నదీ జలాల విషయంలో కావాలనే కెలికి కయ్యం పెట్టుకుంటోందని.. కేసీఆర్ పదే పదే చెబుతుననారు. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్ధలు కొట్టినట్లు ఏపీకి సమాధానం చెప్పాలని నిర్ణయించారు. ఏపీ జలవనరుల శాఖ అధికారులు కూడా తమ వాదన గట్టిగా వినిపించడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల వివరాలతో పాటు తాము కొత్తగా నిర్మించాలనుకున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి పూర్తి సమాచారాన్ని సిద్ధం చేసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా… అపెక్స్ కౌన్సిల్ భేటీ కంటే ముందే అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close