50వేల ఉద్యోగాలు భర్తీ చేసేయండి : కేసీఆర్

అప్పుడెప్పుడో నాగార్జున సాగర్ ఉపఎన్నికకు ముందు తక్షణం యాభై వేల ఉద్యోగాల భర్తీకి చర్యలుతీసుకోవాలని ఆదేశించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు మరోసారి హుజూరాబాద్ ఉపఎన్నికలకు ముందు అదే స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఉద్యోగ ఖాళీల భర్తీపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి భేటీ జరిగింది. తొలి దశలో అన్ని శాఖల్లో కలిపి 50వేల ఉద్యోగాల భర్తీ చేయాలని.. రెండో దశలో ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఖాళీల భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. భర్తీ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్నారు. నూతన జోనల్ విధానానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోదించినందున.. భర్తీ ప్రక్రియకు అన్నిరకాల అడ్డంకులు తొలగిపోయాయని స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ ప్రకటనపై నిరుద్యోగులు నమ్మకం పెట్టుకోలేకపోయారు.

అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటం.. వెంటనే నాగార్జున సాగర్ ఉపఎన్నిక రావడం.. మినీ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడంతో… ఆ ఉద్యోగాల ఆశ చూపి.. మొత్తం ఎన్నికలను ఈదేశారన్న విమర్శలు వచ్చాయి. దానికి తగ్గట్లుగానే ఈటల ఇష్యూ వచ్చే వరకూ ఉద్యోగాల భర్తీపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. డిమాండ్లు వచ్చినప్పుడల్లా.. త్వరలో త్వరలో అని చెప్పడం ప్రారంభించారు. ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నిక రావడంతో.. మళ్లీ ఉద్యోగాల భర్తీపై కదలిక వచ్చింది.

అయితే.. ఇప్పుడైనా భర్తీ పూర్తవుతుందా.. మధ్యలో ఆగిపోతుందా.. లేకపోతే అసలు ప్రారంభమే కాదా అన్నది ఎవరికీ అంతుబట్టని విషయం. అయితే.. నిరుద్యోగుల్లో మాత్రం మళ్లీ ఆశలు చిగురించడం ఖాయం. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఉద్యోగాల ఆశతో కోచింగ్ సెంటర్లకే పరిమితమైన లక్షల మంది నిరుద్యోగులు మళ్లీ ఆశపడతారు. వారికి నోటిఫికేషన్లు అందుతాయా.. ఈ లోపు ఉపఎన్నిల నోటిఫికేషన్ వచ్చి అడ్డం పడుతుందా అన్నది వేచి చూడాల్సిందే.!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close