ఏపీలో జోక్యం చేసుకుంటాం.. దేశాన్ని మారుస్తాం..! చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్..!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలని ఏపీ నుంచి తన లక్ష ఫోన్లు వచ్చాయని… తెంలగాణ అసెంబ్లీ ఎన్నికల విజయోత్సాహంలో ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నాని .. అక్కడి ప్రజలు ఏపీ రాజకీయాల్లో కలుగుజేసుకోవాలని అడుగుతున్నారని ప్రకటించుకున్నారు. దేశరాజకీయాలను మార్చే క్రమంలో ఏపీ రాజకీయాలను మారుస్తామన్నారు. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో మీరే చూస్తారని జర్నలిస్టులను ఉద్దేశించి అన్నారు. చంద్రబాబు తెలంగాణ వచ్చి పనిచేశారు..మేం వెళ్లి పనిచేయాలా వద్దా? అని ప్రశ్నించారు. తమకు చంద్రబాబు గిఫ్ట్ ఇచ్చారని… మేం రిటర్న్‌గిఫ్ట్‌ ఇస్తామన్నారు. మా గిఫ్ట్‌ ప్రభావం ఎంతుంటుందో మీరే చూస్తారని వ్యాఖ్యానించారు.

సచివాలయానికి వెళ్లరన్న విమర్శలకు కేసీఆర్‌ కౌంటర్ ఇచ్చారు. సీఎం ఎక్కడ ఉన్నారన్నది ముఖ్యం కాదు.. సీఎం ఏం చేశారన్నదే జనానికి ముఖ్యమన్నారు. సీఎం ఎక్కడ ఉంటే.. అక్కడ సచివాలం ఉన్నట్లేనని ప్రకిటంచారు. తెలంగాణపై ఢిల్లీ పెత్తనమేందని ప్రశ్నించారు. విద్య,వైద్యం, వ్యవసాయం ఢిల్లీ చేతుల్లో ఎందుకని ప్రశ్నించారు. రాజ్యాంగంలో 50 శాతం రిజర్వేషన్లే ఇవ్వాలని లేదని… రిజర్వేషన్లను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సుప్రీంకోర్టు తెలివి తక్కువ తీర్పు ఇచ్చిందన్నారు. రాజ్యాగంలో ఉమ్మడి జాబితా ఉండకూడదనిన్నారు. ఇంత పెద్ద దేశానికి ఒక్క సుప్రీంకోర్టా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు అధికారాల్ని పరిమితం చేయాలన్నారు. విజయం ఎంత గర్వంగా ఉందో…బాధ్యత అంతే బరువుగా ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం పూర్తి కావాలని ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. గిరిజనులు, గిరిజనేతరుల పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని.. ఉద్యోగ ఖాళీల భర్తీని వేగవంతం చేస్తామన్నారు. దళితులు, గిరిజనుల పేదరికాన్ని నిర్మూలిస్తామని రెడ్డి, వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.

జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఉదయం మమతాబెనర్జీ, జాతీయ నేతలు మాట్లాడారని.. తాము దేశానికి దిక్సూచిగా ఉంటామన్నారు. నాన్‌ కాంగ్రెస్‌, నాన్ బీజేపీ పాలన రావాలని ఆకాంక్షించారు. దీనికి తెలంగాణ ఫలితాలు నాంది పలికాయన్నారు. నాలుగు పార్టీలను ఒక చోటుకు చేర్చి.. భుజాలు రాసుకోవడం కాదు కావాల్సిందని చంద్రబాబు ఫ్రంట్ ప్రయత్నాలను విమర్శించారు. మైనార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు అసదుద్దీన్ తాను.. దేశమంతా పర్యటిస్తామన్నారు. హెలికాప్టర్లను కూడా సిద్ధం చేసుకున్నామని ప్రకటించారు. వచ్చే నెల రోజుల్లో దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు చూస్తారని ప్రకటించారు. రేపు ఉ.11.30కి టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం జరుగుతుందని.. అందులో తదుపరి నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close