గత ఎన్నికల నాటి హామీలే ఇప్పుడు కేసీఆర్‌కు గుదిబండలు !

2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ చాలా హామీలు ఇచ్చారు. మళ్లీ ఎన్నికలు ముంచుకు వస్తున్నా వాటిని అమలు చేయలేకపోయారు. బడ్జెట్లలో నిధులు కేటాయించినా విడుదల చేయలేదు. అలాంటి పథకాలు ఇప్పుడు కేసీఆర్‌కు గుదిబండలుగా మారాయి. కేసీఆర్ అప్పట్లో ఇచ్చిన హామీల్లో కీలకమైనది రుణమాఫీ. కాంగ్రెస్ రూ. రెండు లక్షల రుణమాఫీ హామీ ఇస్తే కేసీఆర్ రూ. లక్ష ఇచ్చారు. అయినా ప్రజలు నమ్మారు. కానీ ఇంత వరకూ ఆ రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదు.

బ్యాంకర్ల నివేదిక మేరకు 47.4 లక్షల మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. దానికి గాను రూ.24,738 కోట్లు అవసరం అని తేల్చారు. ఇప్పటి వరకూ రూ.3,881 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఇంకా రూ.20,857 కోట్లు మాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. 2022 -23 ఆర్థిక సంవత్సరంలో దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్ లో చూపించారు. కానీ ఖర్చుచేయలేదు. సొంత జాగా ఉన్న వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తామని గత బడ్జెట్ సమయంలో ప్రకటించారు. ఇంత వరకూ అమలు కాలేదు.

నిరుద్యోగులకు రూ.3016 నిరుద్యోగ భృతి ఇస్తామని గత ఎన్నికల ముందు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఎవరికీ ఒక్క రూపాయి భృతి ఇవ్వలేదు. . ఇ క గొర్రెల పెంపకం దార్లకు యూనిట్లు ఇస్తామని వారి దగ్గర కొంత సొమ్ము చెల్లించుకున్నా ఇవ్వలేదు. ఇలాంటి పథకాలు .. ప్రజలపై నేరుగా చూపే పథకాలకు కూడా కేసీఆర్ నిధులు కేటాయించలేకపోతున్నారు. ఎన్నికల బడ్జెట్‌లో వాటికి నిధులు కేటాయించడమే కాదు.. ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇదే కేసీఆర్‌కు అతి పెద్ద సవాల్ అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close