గుత్తాకు ఎమ్మెల్సీ… తర్వాత మంత్రి పదవే..!

అనర్హతా వేటు పడిన యాదవరెడ్డి స్థానంలో.. భర్తీ కానున్న ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ఖరారు చేశారు. చాలా కాలంగా ఆయన ఎమ్మెల్సీ సీటు కోసం ఎదురు చూస్తున్నారు. గుత్తా లక్ష్యం మంత్రి పదవి. ఆ పదవి రావాలంటే.. ముందు ఎమ్మెల్సీ అవ్వాలి. కానీ సామాజిక సమీకరణాలు.. ..టీఆర్ఎస్‌ అధినేతకు ఉన్న ఇతర కమిట్‌మెంట్ల వల్ల.. గుత్తాకు.. ఎమ్మెల్సీ పదవి దక్కడం ఆలస్యం అవుతూ వచ్చింది. త్వరలో.. మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న అంచనాల నేపధ్యంలో.. ఇప్పుడు.. అనూహ్యంగా ఎమ్మెల్సీగా ఖరారు చేయడంతో.. గుత్తా సుఖేందర్ రెడ్డికి.. మంత్రి పదవి ఆశలు చిగురించాయి.

కాంగ్రెస్ పార్టీ తరపున 2014లో ఎంపీగా గెలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డి.. ఆ తర్వాత .. టీఆర్ఎస్ సర్కార్‌పై ప్రతిపక్ష పార్టీ నేతగా బాగానే పోరాడారు. అనేక అంశాలపై కోర్టుల్లో పిటిషన్లు కూడా వేశారు. గుత్తా వేసిన పిటిషన్ ఆధారంగానే… అప్పట్లో కేసీఆర్.. పార్లమెంటరీ సెక్రటరీలుగా.,. కేబినెట్ హోదాలో నియమించిన ఎమ్మెల్యేల పదవులను తీసేయాల్సి వచ్చింది. అయితే అనూహ్యంగా ఆ తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అప్పుడే ఆయనకు.. కేసీఆర్ మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారని ప్రచారం జరిగింది. కానీ ఆ సమయంలో.. మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో… కోదాడ లేదా.. హుజూర్ నగర్ నుంచి పోటీ చేయమని ఆఫర్ ఇచ్చినప్పటికీ.. గుత్తా వెనుకడుగు వేశారు. తనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ఆయన కోరారు.

ఇప్పుడు.. గుత్తాకు ఎమ్మెల్సీ ఇస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కుతుందో లేదో మాత్రం.. చెప్పడం కష్టమని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. తనకు కేసీఆర్ హామీ ఇచ్చారని.. గుత్తా సుఖేందర్ రెడ్డి నమ్మకంతో ఉన్నారు. తనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారని ఆయన ఆశాభావంతో ఉన్నారు. మంత్రి కావాలన్నదే.. గుత్తా సుఖేందర్ రెడ్డి లక్ష్యం. మరి అది నెరవేరుతుందో.. లేదో.. త్వరలోనే తేలిపోయే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close