నిజంగా అది నగదు బదిలీనే! దీంతోనే ఓట్ల బదిలీ..?

ప్రభుత్వాలు పథకాలు ప్రకటించినప్పుడు ప్రచారం ఎక్కువగా రావాలంటే కొన్ని పద్ధతులు, టెక్నిక్కులు ఉంటాయి. తెలంగాణ రైతాంగానికి ఎరువులు ఉచితంగా సరఫరా చేయనున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్‌ నాటకీయంగా, ఆకస్మికంగా ప్రకటించారు. ఇది విప్లవాత్మకమని, ప్రతిపక్షాలను నివ్వెరపోయేట్లు చేసిందని మీడియాలో కథనాలు హోరెత్తించారు. వాస్తవానికి ఆయన నాలుగు వేల రూపాయలు నగదు బదిలీ చేయడం తప్ప ఎరువుల సరఫరాతో, అవసరాలతో ప్రత్యక్ష సంబంధం ఏమీ ప్రకటించలేదు. నాలుగేళ్ళపాటు రూ.4వేల కోట్ల చొప్పున రుణమాఫీ పథకం అయిపోయిందని చెప్పారుగనుక, ఐదవ ఏట అంటే ఎన్నికల సంవత్సరంలో ఆ మొత్తాన్ని ఎరువుల పేరిట రైతులకు బదలాయించటం ఈ ప్రకటన సారాంశమని నేను మొదట్లోనే చెప్పాను. రాశాను కూడా. ప్రపంచబ్యాంకు సిద్ధాంతాల ప్రకారం సంక్షేమ భారాలు తగ్గించుకోవడానికి నగదు బదిలీ ఉత్తమ మార్గం. ఇది 2009లో కెసిఆర్‌ టిడిపితో కలిసి పోటీ చేసినప్పుడు కూడా ప్రచారం చేసిన పథకాల వంటిదే. నిజామాబాద్‌ సమీక్షలో ఒక్కసారిగా ఉచిత ఎరువులు ప్రకటన చేయటం వ్యూహాత్మక చర్య మాత్రమే. వివరాలు కావాలి గనుక వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామని అన్నప్పటికీ వాస్తవంలో ఎన్నికల సందర్భం అందరికీ తెలిసిందే. పైగా ఈ మొత్తం అందించేందుకు, నిర్వహించేందుకు గ్రామాల స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు రైతు సంఘాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంటే వీటిలో టిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలే ఉంటారన్నది స్పష్టం. ఆ విధంగా కింద నుంచి పై వరకు ఒక పెద్ద వ్యవస్థ గ్రామాల్లో ఏర్పడుతుంది. అలాగే ఈ సహాయం పెద్ద రైతులకు కూడా అందించటం జరుగుతుందని చెప్పినమాట కూడా కెసిఆర్‌ ప్రకటనతో నిజమని తేలింది. కాకపోతే తెలంగాణలో వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని ఆయన ఇచ్చిన వివరాలు సమర్థనకే పనికివస్తాయి. సంఖ్య ఏదైనా, ఎంతైనా సంక్షేమ పథకాలకు ఆర్థిక కొలబద్దలు ఉండాలి. పైగా ఈ సందర్భంగా ప్లీనరీలో మాట్లాడిన కెసిఆర్‌ రైతాంగానికి కూలీలు దొరకడం లేదని ఆవేదన వెలిబుచ్చడం సంపన్న, అధికాదాయ వర్గాల మాటలనే తలపిస్తుంది. భూమిలేని రైతులు, వ్యవసాయ కార్మికుల కోణంలో అయితే ఉపాధి హామీ పథకంపై వ్యాఖ్యలకు అవకాశం ఉండేది కాదు. వృత్తిదారులకు ఆధునిక క్షౌరశాలలు, వాషింగ్‌ మెషిన్లు వంటివి ఇస్తామన్నది కూడా ఈ తరహాలోనే ఉభయతారకంగా చేసిన ఆలోచన. మొత్తంపైన వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ గ్రామసీమల్లో ప్రతివారికీ ప్రభుత్వం సహాయ పడిందనే ప్రచారం రావాలన్నది ముఖ్యమంత్రి కీలక భావనగా అర్థమవుతున్నది. సంక్షేమ పథకాలు స్వాగతించినా, పేరుకుపోయిన మౌలిక సమస్యలకు వ్యవస్థాగత అంశాలకు అవి పరిష్కారం చూపలేవని అనుభవం చెబుతున్న సత్యం. ప్రత్యేకించి తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఇలాంటి చిట్కాలు దాన్ని ఏమాత్రం తగ్గించలేవు. ప్రస్తుతానికి మాత్రం నగదు బదిలీ అటు బదిలీ ఇటు జరుగుతుందని టిఆర్‌ఎస్‌ ఆశ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close