“నగదు రహితం” కోసం చకచకా సన్నాహాలు

తెలంగాణలో నగదు రహిత విధానాన్ని విజయవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం సీరియస్ గా ప్రయత్నిస్తోంది. క్యాష్ లెస్ లావాదేవీలకు ప్రోత్సాహం, టి వాలెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించిన కేబినెట్ సబ్ కమిటీ సోమవారం భేటీ అయింది. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. మంత్రులు ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, జగదీష్ రెడ్డి, మహేందర్ రెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

క్యాష్ లెస్ లావాదేవీల విషయంలో సిద్దిపేట నియోజకవర్గంలోని తాజా పరిస్థితిని కూడా చర్చించారు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రచార ప్రక్రియ ఎలా ఉండాలనేదానిపై పలు సూచనలు వచ్చాయి. టెక్నాలజీని వీలైనంత ఉపయోగించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల సలహాలను మంత్రులు ఆహ్వానించారు.

టి వ్యాలెట్ ను సమర్థంగా అమల్లోకి తీసుకొస్తే ప్రభుత్వ ఉద్దేశం నెరవేరుతుందని కేటీఆర్ చెప్పారు. వివిధ శాఖలు, సేవలకు చెల్లింపుల కోసం ఒకే యాప్ రూపొందించడానికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. దేశంలో అత్యధికంగా క్యాష్ లెస్ లావాదేవీలు జరిపే రాష్ట్రంగా తెలంగాణను నిలపడానికి అందరూ సహకరించాలని కేటీఆర్ కోరినట్టు సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close