శ్రీశైలం ప్రమాదంలో 9 మంది మృతి..! సీఐడీ విచారణకు కేసీఆర్ ఆదేశం..!

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారంతా చనిపోయారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం తొమ్మది ఆచూకీ ప్రమాదం జరిగినప్పటి నుండి తెలియడం లేదు. వీరిని రక్షించాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్లాంట్ లోపల.. దట్టంగా కమ్ముకున్న పొగలు.. సహాయ కార్యక్రమాలను ముందుకు సాగకుండా చేశాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అత్యాధునిక పరికరాల సాయంతో చేసిన రెస్క్యూ ఆపరేషన్‌లో మృతదేహాలను మాత్రమే గుర్తించగలిగారు.

ప్రమాదంలో అందరూ చనిపోయినట్లు సమాచారం తెలియగానే.. ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాణనష్టం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని … అందరికీ ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ప్రమాదం రెస్క్యూ ఆపరేషన్ కేసీఆర్ మంత్రి జగదీష్‌రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు నుంచి తరచూ వివరాలు తీసుకున్నారు.

మరో వైపు శ్రీశైలం పవర్ ప్లాంటులో ప్రమాదంపై సీఐడీ విచారణకు కేసీఆర్‌ ఆదేశించారు. సీఐడీ అడిషనల్‌ డీజీపీ గోవింద్‌సింగ్‌ కు బాధ్యతలు అప్పగించారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై అధికారవర్గాలు ఇంత వరకూ క్లారిటీకి రాలేకపోయాయి. మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి రాకపోవడంతో ప్లాంట్‌లో అసలేం జరిగిందో అంచనా వేయడం కష్టంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close