ఎదురు దాడికి పక్కా స్కెచ్!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చర్చకు వేదిక కావాలే తప్ప రచ్చ జరగకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే తన ఉద్దేశాన్ని వెల్లడిస్తున్నారు. ప్రతిపక్షాలు అర్థవంతమైన చర్చకు సహకరిస్తే అడిగినన్ని రోజులు సమావేశాలు జరపడానికి సిద్ధమని ఆయన ఇదివరకే చెప్పారు. ఒకవేళ రచ్చ జరిగితే మాత్రం త్వరగా సమావేశాలకు ముగింపు పలకాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. సోమవారం ప్రగతిభవన్ లో జరిగిన సమీక్షా సమావేశంలోనూ ఆయన ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారని తెలుస్తోంది.

ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలను ముందుగానే ఊహించి ఓ జాబితా సిద్ధం చేసుకోవాలి. శాఖల వారీగా మంత్రులు వివరాలను తెలుసుకుని ప్రిపేర్ కావాలి. కొందరు ఎమ్మెల్యేలుకూడా సబ్జెక్టుల వారీగా నోట్స్ సిద్ధం చేసుకోవాలి. విపక్షాలపై ఎదురు దాడి సమయంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా సమర్థంగా మాట్లాడాలి. సబ్జెక్టుపై పూర్తి అవగాహనతో చర్చించడం ద్వారా ప్రభుత్వం ఎలా పనిచేస్తోందో ప్రజలకు తెలిసేలా జాగ్రత్తలు తీసుకోవాలి… ఇవీ సమీక్ష సందర్భంగా కేసీఆర్ చేసిన సూచనలు.

ఈనెల 16 నుంచి నెలాఖరు వరకు సమావేశాలను జరపాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఆ తర్వాత సభ జరిగే తీరునుబట్టి సమావేశాలను పొడిగించడంపై నిర్ణయం తీసుకుంటారు. రైతులు, విద్యార్థుల సమస్యలు, డబుల్ బెడ్ రూం తదితర హామీలను అమలు చేయకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. వాటికి దీటుగా బదులివ్వడానికి కేసీఆర్ తన పార్టీ వారిని సన్నద్ధం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close