ఆ కేసు విషయంలో షర్మిలను టెన్షన్ పెడున్న కేసీఆర్..!

తెలంగాణ సర్కార్‌కు షర్మిలపై ఎనలేని అభిమానం ఉంది. ఆమెపై ఉన్న ఓ కేసును ఎత్తివేయడానికి ప్రయత్నిస్తోంది. కానీ.. ఆ కేసు ఎత్తేస్తే అదే కేసులో ఉన్న తమ వ్యతిరేకులు కొండా మురళి, కొండా సురేఖలపైనా కేసు ఎత్తేయాల్సి ఉంటుంది. దీంతో షర్మిలకు రిలీఫ్ ఇవ్వడానికి తెలంగాణ సర్కార్… వేరే మార్గాలు అనుసరిస్తోంది. అయితే కోర్టు మాత్రం… అలా ఓ కేసులో ఉన్న కొంత మందిపై కేసు ఎత్తివేయడం.. కొంత మందిపై కొనసాగించడం ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్న వినిపిస్తోంది. దీంతో తెలంగాణ సర్కార్‌కు చిక్కులు వచ్చి పడ్డాయి. అసలు కేసు టీఆర్ఎస్ దృష్టిలో చిన్నది కాదు. పెద్దదే. అదేమిటంటే… 2012లో పరకాలలో ఉపఎన్నికలు జరిగాయి. వైసీపీ తరపున కొండా సురేఖ పోటీపడ్డారు. టీఆర్ఎస్ తరపున భిక్షపతి పోటీ చేశారు.

ఆ సందర్భంగా పోటీ తీవ్ర స్థాయిలో జరిగింది. ఆ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయినట్లయితే.. ఉద్యమ హవా తగ్గిపోయేది. కానీ స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. ఆ సమయంలో పోటీ చేసిన కొండా సురేఖ తరపున ప్రచారానికి షర్మిల, విజయలక్ష్మి వెళ్లారు. అయితే.. అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని అప్పుడు కేసు నమోదైంది. ప్రజాప్రతినిధులపై కేసులను త్వరగా తేల్చే ఉద్దేశంలో ఉన్న న్యాయస్థానాలు ఇటీవల ఇలాంటికేసులన్నింటినీ త్వరత్వరగా విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో షర్మిల, విజయలక్ష్మిల కేసు కూడా విచారణకు వస్తోంది. ఓ సారి వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ లోపు కేసును ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి కూడా పెరిగింది.

ప్రభుత్వం కూడా..షర్మిళ, విజయలక్ష్మిలపై ఉపసంహరించుకోవాలనే అనుకుంటోంది. ఇది ఒక్క రోజులోనే పని. కానీ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. విజయమ్మ, షర్మిళపై మాత్రమే కేసు ఉపసంహరించే ఉద్దేశం కనిపిస్తోందని.. హైకోర్టు ఆదేశాల మేరకు కేసును త్వరగా తేల్చాల్సి ఉందని స్పష్టం చేశారు. 31న విజయమ్మ, షర్మిళ సహా నిందితులందరూ హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మామూలుగా అయితే ఈ కేసులో… అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించినట్లుగా ఆధారాలను అధికారులు సమర్పించినట్లుగా తెలుస్తోంది. దీంతో షర్మిల, విజయలక్ష్మిలపై కేసు ఉపసంహరించుకోవాలనే ఒత్తిడి పెరుగుతోంది. కానీ వీరి పేరుతో.. కొండా దంపతులకు రిలీఫ్ ఇవ్వడానికి సిద్ధం కావడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close