అమిత్ షాకు ఆయుధాలిచ్చేస్తున్న కెసీఆర్

భారత దేశ రాజకీయాలను ఒకసారి పరిశీలిస్తే ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి రావడానికి అవసరమైన ఆయుధాలను అధికారంలో ఉన్నవారే ఇవ్వడం తరచుగా కనిపిస్తూ ఉంటుంది. సోనియా పుత్రరత్నం రాహుల్ బాబు కామెడీ, ఆ కామెడీ పొలిటీషియన్ రాహుల్‌ని వీరాధి వీరుడిగా, గొప్ప నాయకుడిగా ప్రజెంట్ చేయడం కోసం సోనియా గాంధీ పడ్డ తాపత్రయమే మోడీకి బంపర్ మెజారిటీ తెచ్చిపెట్టింది అనే విశ్లేషణను ఎవరైనా కాదనగలరా? అలాగే 2004 ముందు వరకూ భారతదేశంలోనే ప్రముఖ నాయకుడిగా ప్రచారం చేయించుకోవడంతో పాటు విజయవంతంగా అధికారంలో కొనసాగిన చంద్రబాబు రైతులను, గ్రామ సీమలను నిర్లక్ష్యం చేయడం, కెసీఆర్‌కి మంత్రి పదవి ఇవ్వకపోవడం లాంటి తప్పిదాలతోనే 2004 తర్వాత నుంచీ ప్రతిపక్ష పాత్రకు పరిమితమయ్యేలా చేసింది. అప్పుడు వైఎస్, ఇప్పుడు కెసీఆర్‌లకు ముఖ్యమంత్రి పదవి యోగం పట్టడం వెనుక చంద్రబాబు వైఫల్యాలు కూడా బాగానే పనిచేశాయని చెప్పుకోవాలి.

ఇక ఇప్పుడు కెసీఆర్ కూడా అలాంటి తప్పులే చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌తో పాటు ఇంకా అనేక రాష్ట్రాల్లో అప్పటి వరకూ అధికారంలో ఉన్న నాయకులు చేస్తున్న మైనారిటీ రాజకీయాలే బిజెపిని అధికారంలోకి వచ్చేలా చేస్తున్నాయి. అంటే మైనారిటీలకు ఏదో చేసేశారన్న భ్రమలు ఏమీ అవసరం లేదు. అలా చేసి ఉంటే ఆ మైనారిటీల ఓట్లు అయినా ఇతర పార్టీలకు గుంపగుత్తగా పడి ఉండాలిగా. అదే జరిగి ఉంటే బిజెపికి బంపర్ మెజార్టీలు ఎందుకు వస్తాయి? అయితే మైనారిటీలకు ఏదో చేస్తున్నామన్న భ్రమలు కల్పించడం కోసం బోలెడన్ని పబ్లిసిటీ స్టంట్స్ మాత్రం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కెసీఆర్ కూడా అదే చేస్తున్నాడు. అసలే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత నుంచీ తెలంగాణా రాష్ట్రంపైన అమిత్ షా కాస్త ఎక్కువ కాన్సన్‌ట్రేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కెసీఆర్ చేస్తున్న మైనారిటీ రిజర్వేషన్స్ పబ్లిసిటీ స్టంట్ బిజెపికి మేలు చేసేలా కనిపిస్తోంది. అసెంబ్లీ స్థాయిలో హడావిడి చేసి ఫైనల్‌గా బిజెపిని దోషిగా నిలబెట్టాలన్నట్టుగా కెసీఆర్ వ్యూహరచన చేస్తున్నాడు కానీ ఆ వ్యూహం కంప్లీట్‌గా బూమరాంగ్ అయి కెసీఆర్‌నే దెబ్బకొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మైనారిటీల మెప్పు కోసం కెసీఆర్ పడుతున్న తాపత్రయాన్ని బిజెపి నేతలు బాగా హైలైట్ చేస్తున్నారు. ఒక వర్గానికి రిజర్వేషన్స్ కల్పించడం అంటే ఇతర వర్గాలకు అన్యాయం చేసినట్టు అనే విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఇప్పటికే ఈ రిజర్వేషన్స్ గోలేంట్రా బాబూ అని తిట్టుకుంటున్నవాళ్ళ సంఖ్య భారీగానే ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత వరకూ ఆ ఇష్యూని టచ్ చేయకుండా ఉంటేనే బాగుంటుందేమో. అలా కాకుండా కులాల ఓట్ల కోసం, మతాల ఓట్ల కోసం ఇంకా రిజర్వేషన్స్ పెంచుకుంటూ పోతామంటే మాత్రం మొదటికే మోసం జరగొచ్చు. ఈ ఇష్యూ అయితే బిజెపికి బాగానే కలిసొచ్చే అవకాశం ఉంది. కెసీఆర్ వ్యూహాలను ఎదుర్కునే స్థాయి నేత తెలంగాణాలో లేకపోవడమే కెసీఆర్ ప్రధాన బలం. కానీ అమిత్ షా కనుక రంగంలోకి దిగితే మాత్రం కెసీఆర్ జాగ్రత్తపడాల్సిందే. అలా కాకుండా గుడ్డిగా దూసుకెళ్తానంటే మాత్రం అవకాశాలను ఒడిసి పట్టుకోవడంలో ఆరితేరిపోయిన అమిత్ షా, మోడీల జోడీచేతిలో షాక్ తిన్న నాయకుల లిస్టులో కెసీఆర్ కూడా చేరిపోవడం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కేకే , కడియం..!!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా కేసీఆర్ సన్నిహిత నేతలు కూడా హస్తం గూటికి చేరేందుకు...

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close