తెలంగాణలో ప్రజారోగ్యమే ముఖ్యం..! లాక్‌డౌన్ కొనసాగింపు..!

తెలంగాణ సీఎం కేసీఆర్ బతికుంటే బలుసాకు అయినా తిని బతకవచ్చని.. ప్రస్తుత మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడుకోవడమే ముఖ్యమని భావిస్తున్నారు. ఆర్థికంగా రాష్ట్రం కుదేలవుతున్నప్పటికీ.. ఆయన ఏ మాత్రం ఆలోచన చేయడం లేదు. ప్రస్తుతం కేసులు అంతకంతకూ పెరుగుతున్నందున.. లాక్‌డౌన్ కొనసాగింపు మినహా మరో మార్గం లేదని నిర్ణయించుకున్నారు. ప్రెస్‌మీట్‌లో ఇదే విషయాన్ని చెప్పిన ఆయన ప్రధానమంత్రికీ అదే చెప్పనున్నారు. మంత్రి వర్గ సమావేశంలోనిర్ణయం తీసుకోబోతున్నారు. శనివారం సాయంత్రం.. ప్రధానమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ పూర్తయిన తర్వాత తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై చర్చించి.. లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోనుంది.

లాక్‌డౌన్ విషయంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలు.. ఒకే అభిప్రాయంతో ఉన్నాయి. ఒడిషా, పంజాబ్ రాష్ట్రాలు.. తమ తమ అధికార పరిధిలో ఇప్పటికే.. లాక్ డౌన్ ప్రకటించేశాయి. కేంద్రంతో సంబఁధం లేకుండానే అమలు చేయాలని నిర్ణయించుకున్నాయి. చాలా కొద్ది రాష్ట్రాలు మాత్రం భిన్నాభిప్రాయంతో ఉన్నాయి. కేంద్రం ఆలోచన ఏమిటో స్పష్టత రాలేదు. కానీ కేంద్రం కూడా లాక్ డౌన్ కొనసాగింపునకే మొగ్గు చూపుతోంది. కానీ.. దేశం మొత్తం కాకుండా.. కఠిన నిబంధనలు హాట్ స్పాట్లకే పరిమితం చేసి.. వైరస్ వ్యాప్తి లేని జిల్లాల్లో సడలింపులు ఇవ్వాలని బావిస్తోంది.

వైరస్ ఒకరి నుంచి మరొకరికి శరవేగంగా వ్యాప్తి చెందుతున్నందున తెలంగాణ సర్కార్.. ఆ చాన్స్ కూడా తీసుకోవాలని కోరుకోవడం లేదు. నెలాఖరు వరకు లాక్ డౌన్ కొనసాగిస్తే.. కేసుల సంఖ్య తగ్గుతుందన్న నమ్మకంతో ఉంది. ప్రస్తుతం తబ్లిగీ సభ్యులందర్నీ ట్రేస్ చేసి.. టెస్టులు కూడా పూర్తి చేసినందున… ఇక కొత్త కేసులు రావని నమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. రెండు వారాలు కఠినంగా ఉంటే.. పరిస్థితి మెరుగుపడుతుందన్న అంచనాలో ఉన్నారు. ఆర్థిక కష్టాలను ఎలాగోలా తీర్చుకోవచ్చు కానీ… మనుషుల ప్రాణాలు పోతే మాత్రం తీసుకురాలేమని భావిస్తున్నారు. అందుకే.. మరో మాట లేకుండా లాక్ డౌన్ కొనసాగించాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close