కేసీఆర్ ఢిల్లీకి వెళ్లింది జాతీయ రాజకీయాల కోసమే..!?

కేసీఆర్ ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. సోమవారం కూడా అక్కడే ఉన్నారు. కానీ ఎవరితోనూ మాట్లాడలేదు. ఎవరితోనూ భేటీ కాలేదు. ఎవరి అపాయింట్‌మెంట్లు లభించలేదు. కానీ ఆయనతో పాటు వచ్చిన అధికారులు మాత్రం ఆహారశాఖ అధికారులతో బియ్యం సేకరణపై చర్చ జరిపారు. అయితే కేసీఆర్ కేవలం బియ్యం విషయంలో తేల్చుకుంటామని చెప్పి వచ్చారు కానీ అసలు అంశం రాజకీయమేనని ఢిల్లీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆయన కలవాలనుకున్న కేంద్రమంత్రులు అందుబాటులో ఉండరని తెలిసి కూడా కేసీఆర్ ఢిల్లీకి వచ్చారని అంటున్నారు. పైగా ఆయన ఎప్పుడు తిరిగి వస్తారో స్పష్టత లేదు.

అదే సమయంలో జాతీయ రాజకీయాలపై చర్చించేందుకు ఆయన వెళ్లినట్లుగా తెలుస్తోంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఆమె కూడా కుదిరితే ప్రధానమంత్రితో సమావేశం అవుతానని బయలుదేరేముందు ప్రకటించారు. మమతా బెనర్జీ, కేసీఆర్ ఢిల్లీలో ఉండటంతో ఓ కూటమి ప్రయత్నాలు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లే రోజునే ఓ పెళ్లిలో సీఎం జగన్‌తో చర్చించారు. ఈ కారణంగా జాతీయ రాజకీయాల విషయంలో గుంభనంగా ఏదో జరుగుతోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. రాష్ట్రాన్ని మించి ఎదిగిపోయానని.. ఢిల్లీలోనే తన తదుపరి కార్యాచరణ ఉండాలని ఆయన అనుకుంటున్నారు. ఈ దిశగా మరోసారి చేస్తున్న ప్రయత్నాలే తాజా ఢిల్లీటూర్ అంటున్నారు. మొత్తానిగి ఢిల్లీలో పరిణామాలు శర వేగంగా మారుతున్నాయన్న అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close