జైలు తప్పదన్న బండి – కూకటివేళ్లతో పెకిలిస్తామన్న కేసీఆర్ !

తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. ఫ్రంట్ లేదు.. టెంట్ లేదు కేసీఆర్ జైలుకెళ్లే సమయం దగ్గర పడిందికాబట్టి సానుభూతి కోసమే ఇతర పార్టీల నేతల్ని ప్రగతి భవన్‌కు పిలిపించుకుని మాట్లాడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ విదేశాలకు పోయినా.. ఎక్కడ ఉన్నా గుంజుకొచ్చి జైలుకు పంపుతామని స్పష్టం చేశారు. కేసీఆర్ అవినీతిపై కేంద్రం సీరియస్‌గా ఉందని ఏ క్షణమైనా జైలుకెళ్లడం ఖాయమన్నారు.

బండి సంజయ్ ఇలా హెచ్చరికలు జారీ చేసిన కాసేపటికే.. ప్రగతి భవన్‌ నుంచి కేంద్రంపై మండిపడుతూ కేసీఆర్ చేసిన ప్రకటన బయటకు వచ్చింది. కేంద్రం ఎరువుల ధరలు పెంచిందని..ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న కేంద్రం వ్యవసాయ ఖర్చులను రెట్టింపు చేయడం దుర్మార్గమని ఆ ప్రెస్‌నోట్లో విమర్శించారు. రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే కుట్ర చేస్తుందని .. ఎరువుల ధరలు తగ్గించేలా పోరాటం చేస్తామని.. దేశ వ్యాప్తంగా ఆందోళనలను చేపడుతామని కేసీఆర్ ప్రకటించారు. బీజేపీని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ అంశంపై మోడీకి కేసీఆర్ రాసిన లేఖ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా ఇతర పార్టీల నేతలను కూడగట్టే ప్రయత్నంలో ఉన్న కేసీఆర్ ఏ ఉద్యమం అయినా జాతీయ స్థాయిలో చేస్తామని చెబుతున్నారు. ఆయన ప్రయత్నాలను రాష్ట్ర బీజేపీ నేతలు తేలికగా తీసుకుంటున్నారు. అరెస్ట్ కాకుండా తప్పించుకోవడానికేనని విశ్లేషిస్తున్నారు. మొత్తంగా తెలంగాణ రాజకీయాలు కాక మీదకు మారిపోయాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close