హుజూరాబాద్ ఉపఎన్నిక – కేసీఆర్ ఫికర్..!

హుజూరాబాద్ ఉపఎన్నికల విషయంలో పార్టీ నేతలు రిలాక్స్ అయ్యారని ఆందోళన చెందుతున్నారు. ఉపఎన్నికల షెడ్యూల్ ఇప్పుడల్లా రాదన్న సూచనలు రావడంతో చాలా మంది నేతలు హుజూరాబాద్‌ను వదిలి పెట్టారు. సొంత నియోజకవర్గాలకు వెళ్లిపోయారు. దీంతో కేసీఆర్ అందర్నీ ప్రగతి భవన్‌కు పిలిచి ఆలసత్వం వద్దని హెచ్చరించి పంపించారు. హరీష్ రావు సహా హుజూరాబాద్ బాధ్యతలు చూస్తున్న ముఖ్యనేతలందర్నీ పిలిచిన కేసీఆర్.. తాజా సర్వే రిపోర్టులు వారి ముందు పెట్టి… ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా పరిస్థితి చేజారుతుందని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.

ఇన్‌చార్జీలు ఉప ఎన్నిక ముగిసేంత వరకు బాధ్యతలు అప్పగించిన చోట ఎక్కడివారక్కడే ఉండాలని.. ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దని కేసీఆర్ స్పష్టం చేశారు. పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రతి గడపకూ చేరేలా చేయడే కాకుండా.. ఒక్కో ఓటర్‌ని ప్రత్యక్షంగా పది రోజులకోసారి కలిసేలా చూడాల్సిందేనని స్పష్టం చేశారు. ఉప ఎన్నిక షెడ్యూల్‌ ఎప్పుడు వెలువడుతుందనే అంశాన్ని మర్చిపోవాలని.. రేపే విడుదలవుతుందన్నట్లుగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

ఇప్పటికే హుజూరాబాద్‌లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే నెల మొదటి వారానికల్లా పూర్తి కావాలని.. దళితబంధుపై ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించేందుకు ఏ ఒక్కరినీ వదలకుండా అందరికీ లబ్ధి జరిగేలా చూస్తామనే అంశాన్ని దళితుల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. అవసరమైతే మరోమారు హుజూరాబాద్‌లో పర్యటిస్తానని పార్టీ ఇంచార్జ్‌లకు స్పష్టం చేశారు. ఇప్పటికే హుజూరాబాద్‌లో ప్రచారం తగ్గిపోయింది. పార్టీల నేతలు ప్రెస్‌మీట్లకు పరిమితమవుతున్నారు. ఈ పరిస్థితిని మార్చి టీఆర్ఎస్‌ను ఎప్పట్లాగే యాక్టివ్‌గా ఉంచాలని కేసీఆర్ భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close