కొత్త మున్సిపల్ చట్టంలో ఏముందో అంత సీక్రెట్ ఎందుకు..?

కొత్త మున్సిపల్ చట్టానికి ఆమోదం తెలిపేందుకు తెలంగాణ అసెంబ్లీ రెండు రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నందున మున్సిపల్ యాక్ట్ లో మార్పులకు శ్రీకారం చుట్టింది. పాత చట్టంలో పలు మార్పులు చేసి కొత్తచ‌ట్టాన్ని సభ ముందుకు తీసుకురాబోతుంది. ఇప్పటికే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేవ‌లం మున్సిప‌ల్ బిల్లును ఆమోదించేందుకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న అసెంబ్లీ స‌మావేశాలు రెండు రోజులు మాత్రమే జ‌ర‌గ‌నున్నాయి. గురువారం ఉద‌యం 11 గంట‌ల‌కు స‌భ ప్రారంభం కాగానే మున్సిప‌ల్ బిల్లును సీఎం కేసీఆర్ స‌భ‌లో ప్రవేశ పెడతారు. అప్పుడే బిల్లు ప్రతులను సభ్యులకు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత సభ వాయిదా వేసి.. శుక్రవారం చర్చ చేపడతారు. బిల్లుకు స‌భ ఆమోదం త‌ర్వాత శాస‌న మండ‌లిలో ప్రవేశ‌పెట్టి ఆదే రోజు ఆమోదించే అవకాశం ఉంది.

తెలంగాణ ఏర్పడిన త‌ర్వాత ప్రధాన ప్రతి ప‌క్షం లేకుండా స‌భ జ‌ర‌గ‌బోతోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో 12 మంది ఎమ్మెల్యేలు .. టీఆర్ ఎస్ లో విలీనం చేసుకోవటంతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిప‌క్ష హోదా కోల్పోయింది. ప్రస్తుతం స‌భ‌లో టీఆర్ ఎస్ బ‌లం నామినెటెడ్ ఎమ్మెల్యేతో క‌లిపి 104కు చేరింది. ఎంఐఎం కు 7 గురు, కాంగ్రెస్ కు 6 గురు, టీడీపీ, బీజేపి నుంచి ఇద్దరు స‌భ్యులున్నారు. ప్రస్తుతం స‌భ‌లో టీఆర్ ఎస్ త‌ర్వాత ఎంఐఎం కు ఎక్కువ మంది స‌భ్యులున్నారు.

ప్రతి ప‌క్ష పార్టీల్లో ఎక్కువ మంది స‌భ్యులున్న ఎంఐఎం కు ప్రధాన ప్ర‌తి ప‌క్ష హోదా క‌ల్పించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జ‌రుగుతోంది. ప్రతి ప‌క్ష హోదా ద‌క్కాలంటే.. ప‌దో వంతు మంది స‌భ్యులుండాలి. అయితే ఎంఐఎం కు ప్రతి ప‌క్ష హోదా ఇవ్వాల్సినంత బ‌లం లేక‌పోయినా.. స్పీక‌ర్ త‌న విచ‌క్షణాధికారంతో ఇవ్వొచ్చు. ఈ హోదా ఇవ్వాలని ఓవైసీ బ్రదర్స్ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. వారి కోరికను.. కేసీఆర్ తీరుస్తారని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close