కొత్త మున్సిపల్ చట్టంలో ఏముందో అంత సీక్రెట్ ఎందుకు..?

కొత్త మున్సిపల్ చట్టానికి ఆమోదం తెలిపేందుకు తెలంగాణ అసెంబ్లీ రెండు రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నందున మున్సిపల్ యాక్ట్ లో మార్పులకు శ్రీకారం చుట్టింది. పాత చట్టంలో పలు మార్పులు చేసి కొత్తచ‌ట్టాన్ని సభ ముందుకు తీసుకురాబోతుంది. ఇప్పటికే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేవ‌లం మున్సిప‌ల్ బిల్లును ఆమోదించేందుకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న అసెంబ్లీ స‌మావేశాలు రెండు రోజులు మాత్రమే జ‌ర‌గ‌నున్నాయి. గురువారం ఉద‌యం 11 గంట‌ల‌కు స‌భ ప్రారంభం కాగానే మున్సిప‌ల్ బిల్లును సీఎం కేసీఆర్ స‌భ‌లో ప్రవేశ పెడతారు. అప్పుడే బిల్లు ప్రతులను సభ్యులకు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత సభ వాయిదా వేసి.. శుక్రవారం చర్చ చేపడతారు. బిల్లుకు స‌భ ఆమోదం త‌ర్వాత శాస‌న మండ‌లిలో ప్రవేశ‌పెట్టి ఆదే రోజు ఆమోదించే అవకాశం ఉంది.

తెలంగాణ ఏర్పడిన త‌ర్వాత ప్రధాన ప్రతి ప‌క్షం లేకుండా స‌భ జ‌ర‌గ‌బోతోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో 12 మంది ఎమ్మెల్యేలు .. టీఆర్ ఎస్ లో విలీనం చేసుకోవటంతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిప‌క్ష హోదా కోల్పోయింది. ప్రస్తుతం స‌భ‌లో టీఆర్ ఎస్ బ‌లం నామినెటెడ్ ఎమ్మెల్యేతో క‌లిపి 104కు చేరింది. ఎంఐఎం కు 7 గురు, కాంగ్రెస్ కు 6 గురు, టీడీపీ, బీజేపి నుంచి ఇద్దరు స‌భ్యులున్నారు. ప్రస్తుతం స‌భ‌లో టీఆర్ ఎస్ త‌ర్వాత ఎంఐఎం కు ఎక్కువ మంది స‌భ్యులున్నారు.

ప్రతి ప‌క్ష పార్టీల్లో ఎక్కువ మంది స‌భ్యులున్న ఎంఐఎం కు ప్రధాన ప్ర‌తి ప‌క్ష హోదా క‌ల్పించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జ‌రుగుతోంది. ప్రతి ప‌క్ష హోదా ద‌క్కాలంటే.. ప‌దో వంతు మంది స‌భ్యులుండాలి. అయితే ఎంఐఎం కు ప్రతి ప‌క్ష హోదా ఇవ్వాల్సినంత బ‌లం లేక‌పోయినా.. స్పీక‌ర్ త‌న విచ‌క్షణాధికారంతో ఇవ్వొచ్చు. ఈ హోదా ఇవ్వాలని ఓవైసీ బ్రదర్స్ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. వారి కోరికను.. కేసీఆర్ తీరుస్తారని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close