కేరళను ముంచింది తమిళనాడేనా..?

కేరళ ప్రళయానికి తమిళనాడే కారణమా..? అవుననే అంటోంది కేరళ ప్రభుత్వం. అంతే కాదు.. ఇదే విషయాన్ని చెబుతూ.. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కేరళలో వరదలకు.. కారణం.. ఆకస్మాత్తుగా వచ్చిన భారీ వర్షాలు మాత్రమే కాదని.. డ్యాముల నుంచి నీరు వదలడమేనని.. కొద్ది రోజులుగా పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఎన్ని వర్షాలు పడినా… నీరు సముద్రంలోకి వెళ్లే వ్యవస్థ ఉన్నప్పటికీ.. పెద్ద ఎత్తున డ్యాములు నిర్మించి.. నీటిని నిల్వ చేసి… ఆకస్మాత్తుగా వాటిని వదలడం వల్లే.. కేరళ మునిగిదని చెబుతున్నారు. ముఖ్యంగా ముళ్లపెరియార్, ఇడుక్కి డ్యాముల నుంచి విడుదలైన నీరే… కేరళను ముంచిందని నమ్ముతున్నారు. ఇవి తమిళనాడుకు సంబంధం ఉన్నవే. ఇందుకే తమిళనాడుపై కేరళ ఆరోపణలు చేస్తోంది.

కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ముళ్ల పెరియార్ డ్యామ్.. పూర్తిగా తమిళనాడు ప్రభుత్వం చేతిలో ఉంటుది. నిజానికి ఈ డ్యామ్ పూర్తిగా.. కేరళ భూభాగంలో ఉంటుంది. కాని ఆ డ్యామ్ పై హక్కులు మొత్తం తమిళనాడువే. నీరు కూడా తమిళనాడే వాడుకుంటుంది. ఈ ప్రాజెక్టును కేరళలో 150 ఏళ్ల క్రితం నిర్మించారు. డ్యామ్ పాతది కావడం వల్ల కూల్చివేసి కొత్త డ్యామ్ నిర్మించాలని కేరళ చాలాకాలంగా డిమాండ్ చేస్తోంది. డ్యామ్‌లో నీటి స్థాయిని 142 నుంచి 139 అడుగులకు తగ్గించాలని కోరుతున్నా తమిళనాడు ససేమిరా అంటోంది. వరదలు వచ్చినప్పుడు గరిష్టంగా.. 142 అడుగుల మేర నీటిని నిల్వ చేసింది. ఆ సమయంలో పై నుంచి వరద భారీగా రావడంతో.. ఒకేసారి నీటిని విడుదల చేసేసింది తమిళనాడు.

ముళ్లపెరియార్ డ్యామ్ నుంచి తమిళనాడు… ఆకస్మాత్‌గా విడుదల చేసిన నీరు.. ఇడుక్కి ఆనకట్టకు చేరింది. అది కూడా నిండి పోవడంతో.. గేట్లు ఎత్తివేశారు. దీంతో ఒక్కసారిగా పరిస్ధితి దిగజారిపోయింది. తమిళనాడు తీరుపై సుప్రీంకోర్టులో కేరళ అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఇప్పుడీ విషయం.. కేరళ, తమిళనాడు మధ్య కొత్త తగవులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడుకు.. పొరుగున ఉన్న కర్ణాటక, కేరళలతో అనేక పంచాయతీలు ఉన్నాయి. వీటిని కేరళ వరదలు మరింత ముందుకు తీసుకెళ్తున్నట్లయిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close