వాలంటీర్ల వ్యవస్థ గురించి కొడాలి నానికి తెలియదా.!?

కరోనా విజృంభిస్తున్న సమయంలో.. ఇంటింటికి రేషన్ ఎలా డోర్ డెలివరీ చేస్తామని.. మంత్రి కొడాలి నాని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. రేషన్ కార్డు ఉన్న వారికి ఐదు కేజీల బియ్యం, కేజీ కందిపప్పు ఉచితంగా ఇస్తున్న ఏపీ సర్కార్.. వాటిని రేషన్ దుకాణాలకు వచ్చి తీసుకోవాలని షరతు పెట్టింది. దీంతో రేషన్ దుకాణాల వద్ద పెద్ద ఎత్తున పేదలు గుమికూడుతున్నారు. ఎండలో నిలబడి వడదెబ్బ కారణంగా లేక… విశాఖ జిల్లాలో ఓ మహిళ కూడా మృతి చెందింది. ఈ విషయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మూడున్నర లక్షల మంది వాలంటీర్లను నియమంచి .. ప్రభుత్వ పథకాల్నీ ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం .. అత్యంత క్లిష్ట సమయంలో మాత్రం ప్రజల్ని రేషన్ షాపులకు రావాల్సిందేనని చెప్పడంోత.. గగ్గోలు రేగింది. ప్రతిపక్షాలన్నీ తీవ్ర విమర్శలు చేయడంతో.. కొడాలి నాని… ” ఇంటింటి రేషన్ సరఫరాకు.. కరొనా వ్యాప్తి”కి లింక్ పెడుతూ మీడియా ముందుకు వచ్చారు.

ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను సూపర్‌గా ప్రమోట్ చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్‌మీట్ పెట్టినా.. వాలంటీర్లకు హ్యాట్సాఫ్ చెబుతూంటారు. ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్ ఉన్నారని.. వారు ఆ ఇళ్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియచేస్తున్నారని .. గొప్ప సేవ చేస్తున్నారని ప్రశంసిస్తున్నారు. వాలంటీర్లతో ఇప్పుటికి మూడు సార్లు ఇంటింటి సర్వే చేశామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అందే కాదు.. ప్రభుత్వ పథకాలన్నీ ఆ వాలంటీర్ల ద్వారనే ఇళ్లకు పంపుతున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో రేషన్ ను.. వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నారు. మార్చి ఒకటో తేదీన… ఉదయం మూడు గంటల నుంచి.. మధ్యాహ్నం ఒంటి గంటలోపే.. లక్షల పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వమే ఘనంగా ప్రకటించుకుంది.

అయితే.. ఇవేమీ తెలియనట్లుగా ఇప్పుడు.. కొడాలి నాని.. కరోనా వ్యాప్తి జరుగుతున్న సమయంలో.. ఇంటింటికి డోర్ డెలివరీ ఎలా చేస్తామని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. అలా చేస్తే కరోనా వ్యాప్తి చెందుతుందన్న విచిత్రమైన వాదనను.. వినిపించే ప్రయత్నం చేశారు. రేషన్ షాపుల ముందు గుంపులు గుంపులుగా జనం నిలబడటం కన్నా.. అది ప్రమాదకరం ఎలా అవుతోంది ప్రశ్న వస్తోంది. అది మాత్రమే డోర్ డెలివరీ విధానాన్ని ఇంకా ప్రారంభించలేదని.. మంత్రి కొడాలి నాని చెబుతున్నారు. కానీ.. శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి ఎనిమిది నెలలు అవుతోంది. ఒక్కో నెలలో ఒక్కో జిల్లా నుంచి ప్రారంభిస్తామని చెప్పిన ఇంత వరకూ ప్రారంభించలేదు. ఇలాంటి క్లిష్ట సమయంలోనైనా ప్రారంభించవచ్చు కదా అనే సందేహాలు చాలా మందిలో వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close