కొర‌టాల ఈసారి రూటు మారుస్తున్నాడా?

కొర‌టాల శివ‌.. టాలీవుడ్‌లో టాప్ 3 ద‌ర్శ‌కుల్లో త‌నొక‌డు. వ‌రుస‌గా నాలుగు బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టాడు. మిర్చి ద‌గ్గ‌రి నుంచే అగ్ర హీరోల దృష్టిలో ప‌డిపోయాడు కొర‌టాల‌. శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్‌ల‌తో టాప్ ఛైర్ సంపాదించుకున్నాడు. భ‌ర‌త్ అనే నేనుతో మ‌రో మెట్టు పైకి ఎక్కాడు. ఓ మంచి పాయింట్‌కి క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ జోడించి సినిమాలు తీసి స‌క్సెస్ కొట్టాడు. కొర‌టాల శివ సినిమా అంటే.. క‌చ్చితంగా అందులో సోష‌ల్ ఎలిమెంట్ ఏదో ఒక‌టి ఉండి తీరుతుంద‌ని జ‌నాలు ఫిక్స‌యిపోతున్నారు. అయితే ఈసారి కొర‌టాల రూటు మార్చ‌బోతున్నాడు. సోష‌ల్ మెసేజీల జోలికి పోకుండా పూర్తి స్థాయి క‌మర్షియ‌ల్ సినిమా తీయ‌బోతున్నాడ‌ట‌. ”ఈసారి ఎలాంటి మెసేజీలూ లేని ఓ పూర్తి స్థాయి క‌మ‌ర్షియ‌ల్ సినిమా తీస్తా. ఆ త‌ర‌హా జోన‌ర్ కూడా ఓసారి ట్రై చేయాల‌ని వుంది. ఎలాంటి క‌థ చేయాలి? ఎవ‌రితో చేయాలి? అనేవి ఇంకా ఆలోచించ‌లేదు. ఒక్క‌టి మాత్రం నిజం.. ఈసారి ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా రాబోతోంది” అని హింట్ ఇచ్చేశాడు.కొర‌టాల త‌దుప‌రి సినిమా అల్లు అర్జున్‌తో ఖాయ‌మైంద‌ని న్యూస్‌. దీనిపై కొర‌టాల స్పందించాడు. ”ఇప్పుడిప్పుడే భ‌ర‌త్ నుంచి కాస్త రిలీఫ్ దొరికింది. ముందు కొన్ని రోజులు హాలీడే తీసుకుంటా. ఆ త‌ర‌వాతే కొత్త సినిమా గురించి ఆలోచిస్తా” అంటున్నాడు కొర‌టాల‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close