ఔను.. తాగి షూటింగ్‌కి వెళ్లా

క్ర‌మ‌శిక్ష‌ణ‌కు, తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు మ‌ధ్య చాలా గ్యాప్ ఉంది. కొంత‌మంది తార‌లు షూటింగ్‌కి త‌మ‌కిష్ట‌మొచ్చినప్పుడు వెళ్తుంటారు. సెట్లో పేకాట ఆడేవాళ్లు కొందరైతే, ఏకంగా మందు బాటిల్ ఎత్తేసేవాళ్లు మ‌రికొంద‌రు. విల‌క్ష‌ణ న‌టుడు కోట శ్రీ‌నివాస‌రావుపై కూడా ఇలాంటి అభియోగాలున్నాయి. కోట మందుకొట్టి సెట్‌కి వెళ్తార‌ని, అందుకే.. ఆయ‌న‌కు ఈమ‌ధ్య అవ‌కాశాలు త‌గ్గాయ‌ని అనుకొంటున్నారు. ఈ విష‌య‌మై ఇటీవ‌ల కోట స్పందించారు.

”మందుకొట్టి సెట్‌కి వెళ్తే ఇన్ని సినిమాలు చేసేవాడ్ని కాదు. అలాగ‌ని నేనేం మందు తాగ‌ను అన‌డం లేదు. అదీ లిమిట్‌లోనే. ఫుల్ స్వింగ్‌లో ఉన్న‌ప్పుడు రోజుకి మూడు షిఫ్ట్‌ల‌లో ప‌నిచేయాల్సివ‌చ్చేది. అర్థ‌రాత్రి షూటింగ్ పెట్టేవారు.చ‌లి త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌య్యేది. ఆ సమ‌యంలో చ‌లిని భ‌రించ‌లేక రెండు పెగ్గులు తాగేవాడ్ని. అదీ ద‌ర్శ‌కుడి అనుమ‌తితోనే. రాత్రి ఇంటికి రెండు గంట‌ల‌కు వెళ్లేవాడ్ని. అప్ప‌టికి టీవీలు పెద్ద‌గా ఉండేవి కావు. ఎంట‌ర్‌టైన్మెంట్ దొరికేది కాదు. అందుకే.. మందుతో కాల‌క్షేపం చేయాల్సివ‌చ్చింది. దానికి తాగుబోతు అని పేరు పెట్టేశారు..” అని ఉన్న‌ది ఉన్న‌ట్టుగా నిక్క‌చ్చిగా బ‌య‌ట‌పెట్టేశాడు కోట‌. ఇలా నిజాన్ని నిర్భ‌యంగా చెప్పేవాళ్లు ఎంత మంది చెప్పండి..? ఈ విష‌యంలో కోట‌ని మెచ్చుకొని తీరాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close